News November 30, 2024

2015లో ‘రిషితేశ్వరి’ రాసిన కన్నీటి లేఖ ఇదే.!

image

ANU విద్యార్థిని రిషితేశ్వరి చివరి క్షణాల్లో రాసిన లేఖ క్రూరమృగాలను సైతం కన్నీళ్లు పెట్టిస్తుంది. కనికరం లేకుండా కన్నీళ్లు పెట్టించిన సీనియర్‌లకు ఏం కుళ్లుపుట్టిందో ఏమో రిషితేశ్వరి చిరునవ్వును శాశ్వతంగా దూరం చేశారు. తండ్రితో పాటూ చదువంటే తనకెంతో ఇష్టమని, చదువు కోసం ANUకి వస్తే ప్రేమ పేరుతో సీనియర్లు వేధించారని అప్పట్లో రిషితేశ్వరి లేఖ రాసింది. కాగా ఈ కేసును కోర్టు కొట్టేయడంతో ఆమె లేఖ వైరలైంది. 

Similar News

News March 14, 2026

గుంటూరు: రెవెన్యూ అధికారుల సస్పెండ్

image

భూమి మ్యుటేషన్ వ్యవహారంలో నిబంధనలు ఉల్లంఘించిన తాడికొండ MRO పి.మెహర్ కుమార్, రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ ఎన్. హనుమంతరావు, VROలు టి.బ్రహ్మయ్య, జి.రాంబాబును కలెక్టర్ ఎ.తమీమ్ అన్సారియా సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. విచారణలో లోపాలు బయటపడటంతో ఈ చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

News March 14, 2026

గుంటూరు: రెవెన్యూ అధికారుల సస్పెండ్

image

భూమి మ్యుటేషన్ వ్యవహారంలో నిబంధనలు ఉల్లంఘించిన తాడికొండ MRO పి.మెహర్ కుమార్, రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ ఎన్. హనుమంతరావు, VROలు టి.బ్రహ్మయ్య, జి.రాంబాబును కలెక్టర్ ఎ.తమీమ్ అన్సారియా సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. విచారణలో లోపాలు బయటపడటంతో ఈ చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

News March 13, 2026

గ్యాస్ బుక్ చేసే వారికి ఎస్పీ సూచనలు

image

గ్యాస్ బుకింగ్ పేరుతో సైబర్ నేరాలు జరుగుతున్నాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని గుంటూరు SP వకుల్ జిందాల్ సూచించారు. వంటగ్యాస్ సిలెండర్ల కొరత ఉందనే అపోహలను సైబర్ నేరగాళ్లు తమకు అనుకూలంగా మల్చుకొని ప్రజలను మోసం చేస్తున్నారని చెప్పారు. అదనపు సిలెండర్లు కేటాయిస్తామని బురిడీ కొట్టిస్తున్నారని వివరించారు. అనుమానస్పద లింకులు ఎట్టిపరిస్థితుల్లోనూ క్లిక్ చెయ్యొద్దని సూచించారు.