News November 30, 2024
ఇన్స్టాగ్రామ్లో ప్రేమ.. చివరికి విషాదాంతం

ఆన్లైన్ ప్రేమకు మరో యువతి బలైంది. విజయవాడకు చెందిన ఓ యువతి ఇన్స్టాగ్రామ్లో పరిచయమైన వ్యక్తితో ప్రేమలో పడింది. అతడినే పెళ్లి చేసుకోవాలనుకోగా పేరెంట్స్ నిరాకరించారు. దీంతో ఆమె ఎలుకల మందు తాగింది. కుటుంబసభ్యులు ఆస్పత్రికి తరలించి ప్రాణాలు కాపాడారు. తర్వాత ఆమె ఇంట్లో నుంచి వెళ్లిపోగా తిరిగి తీసుకొచ్చారు. మరోసారి వెళ్లిపోయి ఏలూరు కాలువలో దూకింది. తాజాగా ఆమె శవాన్ని పోలీసులు గుర్తించారు.
Similar News
News March 21, 2026
బడ్జెట్లో మైక్రో SUV.. సరికొత్తగా ఎక్స్టర్

మధ్యతరగతి ఫ్యామిలీలే టార్గెట్గా మార్కెట్లోకి హ్యుందాయ్ సరికొత్త ఎక్స్టర్ను తీసుకొచ్చింది. ఈ మైక్రో SUV ప్రారంభ ధరను రూ.5,79,000(ఎక్స్ షోరూమ్)గా నిర్ణయించింది. పాత మోడల్తో పోలిస్తే కాస్త డిజైన్ ఛేంజెస్ చేసింది. తొలిసారి డ్యాష్క్యామ్ ఫీచర్ తీసుకొచ్చింది. స్పోర్టీ డీ-కట్ స్టీరింగ్ వీల్, లాంగ్ వీల్బేస్, 4 సిలిండర్ 1.2 కప్పా పెట్రోల్ ఇంజిన్ సహా 25రకాల మార్పులు చేసినట్లు కంపెనీ తెలిపింది.
News March 21, 2026
భారీగా పెరిగిన చికెన్ ధరలు!

రంజాన్ సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లో చికెన్ ధరలు అమాంతం పెరిగాయి. నిన్నటి వరకు కేజీ రూ.330 వరకు విక్రయాలు జరిగాయి. ఇవాళ ఆ ధర భారీగా పెరిగి రూ.400కు చేరింది. విజయవాడలో కిలో స్కిన్లెస్ చికెన్ రూ.380-రూ.400 వరకు అమ్ముతున్నారు. హైదరాబాద్లో రూ.340-350 వరకు విక్రయిస్తున్నారు. ఎండల తీవ్రతకు ఉత్పత్తి తగ్గడమూ ధరల పెరుగుదలకు కారణమని వ్యాపారులు చెబుతున్నారు. మీ ప్రాంతంలో చికెన్ రేట్ ఎంత ఉంది?
News March 21, 2026
కల్తీని అరికట్టేలా.. తిరుమలలో ఫుడ్ ల్యాబ్ రెడీ!

తిరుమలలో వాటర్, ఫుడ్ అనాలసిస్ ల్యాబోరేటరీ సిద్ధమైంది. ₹25 కోట్ల వ్యయంతో నిర్మించిన ల్యాబ్ను ఇవాళ CM చంద్రబాబు ప్రారంభించనున్నారు. ప్రసాదాల్లో వినియోగించే ముడిసరకును ఇక్కడే తనిఖీ చేయనున్నారు. ఇందుకోసం అత్యాధునిక పరికరాలను అందుబాటులో ఉంచారు. సూక్ష్మస్థాయిలో కల్తీ జరిగినా గుర్తించేలా పరీక్షలు చేయనున్నారు. ఈ తరహా ఫుడ్ ల్యాబ్ ఓ పుణ్యక్షేత్రంలో ఏర్పాటు చేయడం దేశంలోనే తొలిసారి కావడం గమనార్హం.


