News November 30, 2024
MBNR: బహిరంగ సభకు తరలిన రైతులు

అమిస్తాపూర్లో కాంగ్రెస్ ప్రజాపాలన ‘రైతు పండగ’కు సర్వం సిద్ధంమైంది. బహిరంగ సభకు భారీ ఏర్పాట్లు చేశారు. ఈ సభకు దాదాపు లక్షమంది రైతులు పాల్గొనేలా నాయకులు ప్లాన్ చేశారు. ఆసక్తిగల రైతులను ఏఈవోల పర్యవేక్షణలో ప్రత్యేక బస్సుల్లో ప్రదర్శన తీసుకెళ్తున్నారు. కాగా రాష్ట్రవ్యాప్తంగా వివిధ జిల్లాల నుంచి రైతులు, నాయకులు ప్రత్యేక వాహనాల్లో అమిస్తాపూర్కు బయలుదేరారు. సీఎం రేవంత్ సాయంత్రం 4.30కి సభలో పాల్గొంటారు.
Similar News
News March 14, 2026
సీసీకుంట: “వెయ్యేళ్ల కురుమూర్తి కొండలను కాపాడండి”

చిన్న చింతకుంట మండలం అమ్మపురం గ్రామంలో క్రషర్ మైనింగ్కు అనుమతి ఇవ్వవద్దని స్థానిక రైతులు, గ్రామస్థులు ఆందోళన వ్యక్తం చేశారు. దేవాలయం పరిసర ప్రాంతాల్లో మైనింగ్ కార్యకలాపాలు జరిగితే పర్యావరణానికి, వ్యవసాయానికి, భక్తుల భావాలకు నష్టం కలుగుతుందని వారు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే మైనింగ్ అనుమతులను నిలిపివేయాలని డిమాండ్ చేశారు.
News March 14, 2026
MBNR: ఎటువంటి గ్యాస్ సిలిండర్ల కొరత లేదు

మహబూబ్నగర్ జిల్లా వ్యాప్తంగా ఎటువంటి గ్యాస్ సిలిండర్ల కొడతా లేదని జిల్లా కలెక్టర్ కుష్బూ గుప్తా అన్నారు. గ్యాస్ సిలిండర్ల విషయంలో ప్రజల ఆందోళన నేపథ్యంలో కలెక్టర్ ఒక ప్రకటన విడుదల చేశారు. సిలిండర్ల విషయంలో ప్రజలు ఎటువంటి ఆందోళన చెందకూడదన్నారు. సంక్షేమ హాస్టల్లో హాస్పిటళ్లు విద్యాసంస్థలు అంగన్వాడీ కేంద్రాలకు గ్యాస్ సరఫరా విషయంలో ఇబ్బందులు తలెత్తకూడదని వెల్లడించారు.
News March 14, 2026
నేడు గద్వాలకు రానున్న సీఎం రేవంత్ రెడ్డి

సీఎం రేవంత్ రెడ్డి శనివారం జోగులాంబ గద్వాల జిల్లాకు రానున్నారు. గద్వాల పట్టణంలో జరగనున్న ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి తనయుడు సాయి సాకేత్ రెడ్డి, ఐశ్వర్య వివాహ వేడుకకు సీఎం హాజరుకానున్నారు. మధ్యాహ్నం 12గంటలకు సీఎం గద్వాలకు చేరుకొని నూతన వధూవరులను ఆశీర్వదించనున్నారని పేర్కొన్నారు. సీఎం రాక సందర్భంగా పోలీసులు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేశారు.


