News November 30, 2024

రుణమాఫీ అరకొరగా చేశారు: కిషన్‌రెడ్డి

image

TG: రాష్ట్రంలో అరకొర రుణమాఫీ చేసి పూర్తిగా మాఫీ చేసినట్లు కాంగ్రెస్ ప్రభుత్వం చెబుతోందని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి విమర్శించారు. గత ప్రభుత్వం ఉద్యోగ నియామక పరీక్షలు నిర్వహిస్తే, వాటినీ తామే భర్తీ చేశామని ప్రచారం చేసుకుంటోందని అన్నారు. 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామన్న కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి నోటిఫికేషన్లే లేవని ఆయన పేర్కొన్నారు. HYDలో BJP సంఘటన్ పర్వ్ వర్క్‌షాప్‌లో ఆయన పాల్గొన్నారు.

Similar News

News March 27, 2026

ఒట్రోవర్ట్స్ గురించి తెలుసా?

image

మనుషుల్లో ఇన్‌ట్రోవర్ట్స్, ఎక్స్‌ట్రోవర్ట్సే కాకుండా ఒట్రోవర్ట్స్ కూడా ఉంటారని US సైకియాట్రిస్ట్ రమీ కమిన్స్కీ చెబుతున్నారు. ‘అందరితో కలిసిపోయినట్లు కనిపిస్తారు. గ్రూపుల్లో యాక్టివ్‌గా, మిగతావారితో కలివిడిగా ఉంటారు. కానీ లోపల మాత్రం వారి అనుభవం వేరుగా ఉంటుంది. తమ నిజమైన స్వభావానికి ప్రాధాన్యం ఇస్తారు. భావోద్వేగాల పరంగా స్వతంత్రంగా ఉంటారు’ అని కమిన్స్కీ వివరించారు. మరి మీరూ ఒట్రోవర్టా?

News March 27, 2026

వెంకీ-కళ్యాణ్ రామ్ మూవీ.. మళ్లీ అదే కాంబినేషన్

image

వెంకీ-కళ్యాణ్ రామ్‌తో అనిల్ రావిపూడి తీస్తున్న కొత్త మూవీకి సాహు గారపాటి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ మేరకు హీరోలతో ఉన్న ఫొటోలను అనిల్ రిలీజ్ చేశారు. అలాగే సురేశ్ ప్రొడక్షన్స్, Z స్టూడియోస్ భాగం కానున్నట్లు తెలిపారు. ఈ మూవీలో కీర్తీ సురేశ్, కృతి శెట్టి నటిస్తున్నట్లు సినీ వర్గాలు చెబుతున్నా మూవీ టీమ్ ప్రకటించలేదు. ఇక సాహు-అనిల్ కాంబోలో భగవంత్ కేసరి, MSVPG మూవీలు వచ్చిన విషయం తెలిసిందే.

News March 27, 2026

ఎండలు.. శరీరానికి డబుల్ షాక్!

image

సమ్మర్‌లో ఉద్యోగులపై డబుల్ ఎఫెక్ట్ పడుతుందని హెల్త్ ఎక్స్‌పర్టులు చెబుతున్నారు. ‘మధ్యాహ్నం బయటికెళ్తే హీట్ ఎక్కువ వస్తుంది. అక్కడి నుంచి ఆఫీసులోకొస్తే చాలా కూల్‌గా ఉంటుంది. ఈ సడెన్ మార్పులతో తలనొప్పి, కళ్లలో మంట, చర్మం పొడిబారడం వంటివి కనిపిస్తాయి. BP పెరగొచ్చు. అందుకే ఎండ నుంచి నేరుగా చల్లటి చోటుకు వెళ్లొద్దు. AC 24–26°C ఉండాలి. దాని ఎదురుగా కూర్చోవద్దు. నీరు ఎక్కువ తాగాలి’ అని అంటున్నారు.