News November 30, 2024

ఉద్యోగిపై ACB రైడ్స్.. రూ.150 కోట్ల ఆస్తులు

image

TG: నీటిపారుదల శాఖ ఏఈఈ నిఖేశ్ ఇంట్లో ఇవాళ ఉదయం నుంచి తనిఖీలు చేస్తున్న ACB భారీగా ఆస్తులు గుర్తించింది. రాష్ట్ర వ్యాప్తంగా 30 ప్రాంతాల్లో నిఖేశ్ నివాసంతో పాటు బంధువుల ఇళ్లల్లో సోదాలు చేసి రూ.150 కోట్ల విలువైన ఆస్తులను గుర్తించింది. రూ.లక్ష లంచం తీసుకుంటూ పది నెలల క్రితం ఆయన పట్టుబడగా, ఆయనపై ACB ఫోకస్ పెట్టింది. ఆయన పేరిట 3 విల్లాలు, 3 ఫామ్‌హౌస్‌లు ఉన్నట్లు ACB గుర్తించింది.

Similar News

News March 15, 2026

ఏం సందేశం ఇస్తున్నారు?

image

డ్రగ్స్ కేసులో TDP MP పుట్టా మహేశ్, BRS మాజీ MLA పైలట్ రోహిత్ రెడ్డి పట్టుబడటం రాజకీయ నాయకులపై ప్రజలకు అసహ్యం కలిగించేలా చేస్తోంది. వీకెండ్ వచ్చిందంటే చాలామంది నేతలు ‘ఎంజాయ్’ చేసేందుకే ఎగిరిపోతున్నారు. తీరా చూస్తే ఇలా ఫామ్‌హౌస్‌లు, పబ్‌లు, క్లబ్బుల్లో ‘గబ్బు’ పనులు చేస్తున్నారు. యువతకు లెక్చర్లు ఇచ్చే ఇలాంటి నేతలు మందు, విందు, డ్రగ్స్ తీసుకుంటూ వారికి ఏం సందేశం ఇస్తున్నారు?

News March 15, 2026

హెల్ప్ చేస్తాం.. కానీ, మాకు డబ్బులు కావాలి: జెలెన్‌స్కీ

image

ఇరాన్‌తో తాము యుద్ధం చేయడం లేదని ఉక్రెయిన్ అధ్యక్షుడు <<19386678>>జెలెన్‌స్కీ<<>> అన్నారు. షాహెద్ డ్రోన్ల నుంచి పశ్చిమాసియా దేశాలను కాపాడేందుకు రక్షణ కవచంలా మారుతున్నామని తెలిపారు. రష్యా ప్రయోగిస్తున్న డ్రోన్లను కూల్చడంలో ఆరితేరిన ఉక్రెయిన్ ఇప్పుడు ఆ అనుభవాన్ని గల్ఫ్ దేశాలకు పంచుతోంది. దీనికి ప్రతిఫలంగా తమకు టెక్నాలజీ, నిధులు కావాలని జెలెన్‌స్కీ కోరారు. ఇప్పటికే ఖతర్, UAE, సౌదీకి ఎక్స్‌పర్ట్స్‌ను పంపారు.

News March 15, 2026

మోగిన ఎన్నికల నగారా.. ఫుల్ డీటెయిల్స్ ఇవే

image

తమిళనాడు, బెంగాల్, కేరళం, అస్సాం, పుదుచ్చేరి(UT)లో ఎన్నికల నగారా మోగింది. 824 నియోజకవర్గాల్లో ఎలక్షన్స్ జరగనున్నాయి. బెంగాల్‌లో అత్యధికంగా 294, TN-234, కేరళం-140, అస్సాం-126, పుదుచ్చేరిలో 30 స్థానాలున్నాయి. 17.4 కోట్ల మంది ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. అందుకోసం 2.19లక్షల పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేయనున్నారు. 25 లక్షల మంది అధికారులు ఎన్నికల విధులు నిర్వర్తించనున్నారు.