News November 30, 2024

WGL: పదేళ్లలో BRS అప్పులు చేసి భారం మోపింది: సీతక్క

image

గత BRSప్రభుత్వం అప్పులు చేసి భారం మోపిందని, అయినా సరే రైతుల సంక్షేమం కోసం రూ.18వేల కోట్లు రుణమాఫీ చేశామని మంత్రి సీతక్క అన్నారు. ఈరోజు మహబూబ్‌నగర్ ‘రైతు పండుగ’ సభలో ఆమె మాట్లాడుతూ.. పాలమూరు బిడ్డ అయిన CMరేవంత్ రెడ్డి రాజ్యమేలుతున్నారని, రైతుల సంక్షేమానికి విప్లవాత్మక నిర్ణయాలు తీసుకుంటున్నారన్నారు. BRSనేతలు రైతులను రెచ్చగొడుతున్నారని, కాంగ్రెస్ ప్రభుత్వంపై అసత్య ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు.

Similar News

News March 9, 2026

పోచమ్మమైదాన్ జంక్షన్‌లో ఉద్రిక్తత.. లాఠీచార్జ్

image

వరంగల్ నగరంలోని పోచమ్మ మైదాన్ జంక్షన్ వద్ద ఆదివారం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఛత్రపతి జెండాను ఓ వర్గానికి చెందిన యువకుడు తొలగించడంతో వివాదం చెలరేగింది. దీంతో మరో వర్గం అక్కడే మళ్లీ జెండా ఏర్పాటు చేయడంతో ఇరువర్గాల మధ్య ఉద్రిక్తత ఏర్పడింది. పరిస్థితి అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు లాఠీచార్జ్ చేసి జనాన్ని చెదరగొట్టారు. ఘటనపై పోలీసులు అప్రమత్తంగా ఉండి పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు.

News March 9, 2026

వరంగల్: ఈవీఎం గోదాములను తనిఖీ చేసిన కలెక్టర్

image

ఎనుమాముల మార్కెట్ యార్డ్‌లోని వేర్‌హౌస్ గోదాముల్లో భద్రపరిచిన ఈవీఎంలను వరంగల్ జిల్లా కలెక్టర్ డా.సత్య శారద ఆదివారం తనిఖీ చేశారు. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో స్ట్రాంగ్ రూమ్ రికార్డులను పరిశీలించారు. ప్రతి మూడు నెలలకు ఒకసారి నిర్వహించే సాధారణ తనిఖీల్లో భాగంగా ఈ కార్యక్రమం చేపట్టారు. ఈ తనిఖీల్లో అదనపు కలెక్టర్ సంధ్యారాణి మరియు ఇతర అధికారులు పాల్గొన్నారు.

News March 9, 2026

వరంగల్: ఈవీఎం గోదాములను తనిఖీ చేసిన కలెక్టర్

image

ఎనుమాముల మార్కెట్ యార్డ్‌లోని వేర్‌హౌస్ గోదాముల్లో భద్రపరిచిన ఈవీఎంలను వరంగల్ జిల్లా కలెక్టర్ డా.సత్య శారద ఆదివారం తనిఖీ చేశారు. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో స్ట్రాంగ్ రూమ్ రికార్డులను పరిశీలించారు. ప్రతి మూడు నెలలకు ఒకసారి నిర్వహించే సాధారణ తనిఖీల్లో భాగంగా ఈ కార్యక్రమం చేపట్టారు. ఈ తనిఖీల్లో అదనపు కలెక్టర్ సంధ్యారాణి మరియు ఇతర అధికారులు పాల్గొన్నారు.