News November 30, 2024

కోటి 53 లక్షల మెట్రిక్ టన్నుల వరి దిగుబడి అయింది: సీఎం

image

కాంగ్రెస్ పార్టీ కట్టిన ప్రాజెక్టుల వల్ల తెలంగాణ రాష్ట్రంలో కోటి 53 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం దిగుబడి అయిందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. రైతు పండుగ బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. రూ.లక్ష రెండు వేల కోట్లతో నిర్మించిన కాలేశ్వరం ప్రాజెక్టులో నీళ్లు లేకపోయినా కాంగ్రెస్ పార్టీ కట్టిన ప్రాజెక్టులతో రైతులు దేశంలో ఎక్కడలేని విధంగా వరి ధాన్యం పండించారని అన్నారు.

Similar News

News March 20, 2026

పాలమూరు: రేపే..రంజాన్ వేడుకలు!!

image

ఉమ్మడి మహబూబ్ జిల్లా వ్యాప్తంగా రంజాన్ వేడుకలు (ఈద్-ఉల్-ఫితర్) ఈనెల 21న జరుపుకోనున్నట్లు మత పెద్దలు ప్రకటించారు. గురువారం ఆకాశంలో నెలవంక కనిపించకపోవడంతో శనివారం పండుగ నిర్వహించాలని సూచించారు. రంజాన్ మాసం నేటితో (మార్చి 20) ముగియనుందని చెప్పారు. ముస్లిం సోదరులు (నమాజ్) ప్రత్యేక ప్రార్థనల కోసం ఈద్గాల వద్ద అన్ని ఏర్పాట్లు చేయనున్నారు.

News March 19, 2026

MBNR: రాష్ట్ర ప్రభుత్వ విప్‌గా MLA యెన్నం శ్రీనివాసరెడ్డి

image

మహబూబ్‌నగర్ నియోజకవర్గ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాసరెడ్డిని రాష్ట్ర ప్రభుత్వ విప్‌గా శాసనసభలో నియమిస్తూ.. గురువారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నియామకంతో ఆయనకు పార్టీ, ప్రభుత్వ కార్యకలాపాలలో మరింత కీలక బాధ్యతలు అప్పగించినట్లు భావిస్తున్నారు. MLA కొంతకాలంగా పార్టీకి విశేష సేవలు అందిస్తూ.. ప్రజా సమస్యల పరిష్కారంలో చురుకుగా పాల్గొన్నారు. పనితీరును గుర్తించి ప్రభుత్వం విఫ్‌గా నియమించింది.

News March 19, 2026

MBNR: ఉగాది వేళ మన్యంకొండకు భక్తుల రద్దీ

image

నూతన తెలుగు సంవత్సరాది ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని మహబూబ్‌నగర్ జిల్లా మన్యంకొండ దేవస్థానంకు భక్తులు పోటెత్తారు. తెల్లవారుజామున నుంచే స్వామివారి దర్శనం కోసం భక్తులు పెద్ద సంఖ్యలో క్యూలైన్లలో నిలబడి భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించారు. ఆలయ పరిసరాలు భక్తులతో కిక్కిరిసిపోయాయి. అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేసి, దర్శనం సజావుగా సాగేందుకు చర్యలు తీసుకున్నారు.