News December 1, 2024

రాష్ట్రంలో మళ్లీ VRO వ్యవస్థ?

image

TG: రాష్ట్రంలో మళ్లీ వీఆర్వో వ్యవస్థను తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది. గతంలో పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా ఎంపికైన VROలకు నేరుగా బాధ్యతలు అప్పగించి, మిగతా వారికి ప్రత్యేక పరీక్షలు నిర్వహించి తీసుకోనున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 3 వేల మంది VROలు ఉండగా, మరో 8 వేల మందిని రాత పరీక్ష ఆధారంగా నియమిస్తారని సమాచారం. 10,909 రెవెన్యూ గ్రామాలకు VROలను నియమిస్తారని తెలుస్తోంది.

Similar News

News December 28, 2025

భారీగా పెరిగిన ఎరువుల ధరలు

image

చైనా ఆంక్షల ఫలితంగా గతేడాదితో పోలిస్తే కాంప్లెక్స్ ఎరువుల ధరలు బస్తాకు రూ.100 నుంచి రూ.500 వరకు పెరిగాయి. 2023-24లో 50 కిలోల బస్తా రూ.1,250-రూ.1,450 మధ్య ఉన్న మిశ్రమ ఎరువుల రేట్లు ప్రస్తుతం రూ.1,450-రూ.1,950కు పెరిగాయి. అటు యూరియా, డీఏపీ ధరల్లో ఎలాంటి మార్పు లేకున్నా వ్యాపారులు ఎమ్మార్పీని మించి విక్రయిస్తున్నారు. దీంతో రబీ సీజన్లో పంటలు సాగు చేస్తున్న అన్నదాతలపై అదనపు భారం పడుతోంది.

News December 28, 2025

అధికారులు చూసుకుంటారు.. నాకేం సంబంధం?: భూమన

image

AP: తిరుమల కల్తీ నెయ్యి కేసులో TTD మాజీ ఛైర్మన్ భూమన కరుణాకరరెడ్డిని సిట్ 2 గంటలకు పైగా విచారించింది. అధికారుల ప్రశ్నలకు తనకేమీ తెలియదని ఆయన చెప్పినట్లు తెలిసింది. నెయ్యి సరఫరా గురించి అధికారులు చూసుకుంటారని, తామెందుకు పట్టించుకుంటామని అన్నట్లు సమాచారం. నాణ్యత లేదని నెయ్యిని తిరస్కరించడం ఎప్పటి నుంచో జరుగుతోందని చెప్పారని, NTR హయాం నుంచే ట్యాంకర్లను తిప్పి పంపుతున్నారని చెప్పినట్లు తెలుస్తోంది.

News December 28, 2025

వెన్నును బలిష్ఠంగా చేసే మేరుదండ ముద్ర

image

మేరుదండ ముద్రను రోజూ సాధన చెయ్యడం వల్ల వెన్నెముక ఆరోగ్యాన్ని మెరుగుపడటంతో పాటు వెన్నునొప్పిని తగ్గించడానికి సహాయపడుతుందంటున్నారు నిపుణులు. ముందుగా వజ్రాసనం/ సుఖాసనంలో కూర్చోని చేతులను తొడలపై ఉంచాలి. బొటన వేలును నిటారుగా పెట్టి మిగతా నాలుగువేళ్లను మడిచి ఉంచాలి. దీన్ని రోజూ సాధన చెయ్యడం వల్ల వెన్ను నొప్పి కూడా తగ్గుతుందంటున్నారు.