News December 1, 2024

కాళ్ల: లారీని ఢీకొట్టిన బైక్.. ఒకరు స్పాట్ డెడ్

image

బతుకుతెరువు కోసం చేపలు వేటకు వెళ్తూ కాళ్ల మండలం సీసలి గ్రామంలో లారీని ఢీకొట్టడంతో ఒకరు మృతి చెందారు. పోలీసుల వివరాల ప్రకారం.. జువ్వలపాలెంకి చెందిన పైడిరాజు, చోడవరపు మధుబాబు బొండాడ లంక వేటకు వెళ్తూ ఎర్రయ్య రైస్ మిల్ వద్ద లారీని ఢీకొట్టారు. దీంతో పైడిరాజు మృతి చెందగా.. గాయపడిన మధుబాబును వైద్యం కోసం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కాళ్ల ఎస్ఐ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు.

Similar News

News March 21, 2026

తరిగొప్పుల రైల్వే స్టేషన్‌లో గుర్తుతెలియని యువకుడి మృతి

image

కృష్ణా జిల్లా తరిగొప్పుల రైల్వే స్టేషన్ ప్లాట్‌ఫారమ్ వద్ద గుర్తుతెలియని యువకుడు(సుమారు 25-30 ఏళ్లు) రైలు ఢీకొని మృతి చెందాడు. మృతుని వివరాలు తెలిసిన వారు వెంటనే గుడివాడ రైల్వే పోలీసులకు సమాచారం ఇవ్వాలని భీమవరం రైల్వే జీఆర్‌పీ సుబ్రహ్మణ్యం కోరారు. మృతుని ఆచూకీ తెలిస్తే 92475 85713, 99890 29379 ఫోన్ నంబర్లను సంప్రదించాలని విన్నవించారు.

News March 21, 2026

ఏళ్లు గడుస్తున్నా అందని టిడ్కో ఇళ్లు.. లబ్ధిదారుల కంటతడి!

image

సొంతింటి కల నెరవేరుతుందని ఏళ్లుగా ఎదురుచూస్తున్న టిడ్కో ఇళ్ల లబ్ధిదారులకు నిరాశే మిగులుతోంది. దసరా, సంక్రాంతి, ఉగాది అంటూ గడువు పొడిగిస్తున్నారే తప్ప ఇళ్లను అప్పగించడం లేదని బాధితులు ఆవేదన చెందుతున్నారు. ఒకవైపు బ్యాంకులకు ఈఎంఐలు చెల్లిస్తూ, మరోవైపు అద్దె ఇళ్ల భారం మోయలేక తిని తినక కాలం వెళ్లదీస్తున్నామని వాపోతున్నారు. తక్షణమే ఇళ్లు పంపిణీ చేయాలని డిమాండ్ చేస్తున్నారు.

News March 21, 2026

ప.గో: అలర్ట్.. దరఖాస్తుల ఆహ్వానం

image

ప.గో జిల్లాలో పర్యాటక రంగాన్ని వేగవంతంగా అభివృద్ధి చేసేందుకు సమగ్ర ప్రణాళికలు రూపొందించి అమలు చేస్తున్నామని కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు. శుక్రవారం భీమవరం కలెక్టరేట్‌లో టూరిజంపై మాట్లాడిన ఆమె, టూరిజం ప్రాజెక్టుల ఏర్పాటుకు ఆసక్తి ఉన్న ఔత్సాహికులు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఆసక్తిగలవారు ceo-apta@ap.gov.in మెయిల్ ఐడీకి 30 రోజుల్లోపు దరఖాస్తు చేసుకోవాలన్నారు.