News December 1, 2024

మెట్రో రైలు ట్రాఫిక్ కంట్రోలర్‌గా రేగోడ్ వాసి

image

మెట్రో లోకో పైలట్ స్థాయి నుంచి మెట్రో ట్రైన్స్‌ను నియంత్రించే స్థాయికి ఎదిగాడు మెదక్ జిల్లా యువకుడు. రేగోడ్‌కు చెందిన బోయిని వీరప్రసాద్ 2017లో ప్రారంభమైన HYD మెట్రోలో భాగంగా నాగోల్ నుంచి అమీర్‌పేట వరకు తొలి ప్యాసింజర్ మెట్రో నడిపారు. గతంలో మెట్రో లోకోపైలట్, మెట్రో డిపో కంట్రోలర్‌గా పనిచేసి నేడు మెట్రో ట్రాఫిక్ కంట్రోలర్ అధికారి అయ్యారు. దీంతో వీర ప్రసాద్‌ను గ్రామస్థులు, మిత్రులు అభినందిస్తున్నారు.

Similar News

News December 26, 2025

MDK: సర్పంచ్ ఫోరం అధ్యక్షుడి ఎన్నికలో ట్విస్ట్‌లు!

image

చిన్నశంకరంపేటలో బుధవారం ఓ ఫంక్షన్ హల్లో సర్పంచులు మీటింగ్ ఏర్పాటు చేసి సర్పంచుల ఫోరం అధ్యక్షుడిగా కామారం తండా సర్పంచ్ మోహన్ నాయక్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు ప్రకటన విడుదల చేశారు. ఇదిలా ఉండగా గురువారం 31 గ్రామపంచాయతీలలోని 16 మంది సర్పంచులు పార్టీలకతీతంగా చిన్నశంకరంపేట సర్పంచ్ NRI కంజర్ల చంద్రశేఖర్‌ను సర్పంచ్ల ఫోరమ్ అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు తెలిపారు.

News December 26, 2025

మెదక్: ఆరోగ్య సేవలు బలోపేతానికే తనిఖీలు: కలెక్టర్

image

ఆరోగ్య సేవలు బలోపేతం చేసే దిశగా జిల్లాలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను నిరంతరం తనిఖీ చేయనున్నట్లు కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు. గురువారం చిన్న శంకరంపేట మండలంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని కలెక్టర్ పరిశీలించారు. పీహెచ్సీలోని హాజరు పట్టికను తెప్పించుకుని పరిశీలించారు. ప్రతి రోజు ఇన్ పేషెంట్లు, అవుట్ పేషెంట్లు ఎంత మంది వస్తున్నారని, మందులు అందుబాటులో ఉన్నాయా తదితర వివరాలు అడిగితెలుసుకున్నారు

News December 26, 2025

మెదక్: ఆరోగ్య సేవలు బలోపేతానికే తనిఖీలు: కలెక్టర్

image

ఆరోగ్య సేవలు బలోపేతం చేసే దిశగా జిల్లాలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను నిరంతరం తనిఖీ చేయనున్నట్లు కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు. గురువారం చిన్న శంకరంపేట మండలంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని కలెక్టర్ పరిశీలించారు. పీహెచ్సీలోని హాజరు పట్టికను తెప్పించుకుని పరిశీలించారు. ప్రతి రోజు ఇన్ పేషెంట్లు, అవుట్ పేషెంట్లు ఎంత మంది వస్తున్నారని, మందులు అందుబాటులో ఉన్నాయా తదితర వివరాలు అడిగితెలుసుకున్నారు