News December 1, 2024
ఇక నుంచి నెలకు రెండుసార్లు!

రైళ్లలో ప్రయాణికులకు అందించే దుప్పట్లను నెలకు కనీసం ఒకసారి ఉతికిస్తున్నామని కేంద్ర మంత్రి ఇటీవల చెప్పిన విషయం తెలిసిందే. అయితే దీనిపై ప్రజల నుంచి వ్యతిరేక వ్యక్తం కావడంతో నెలకు రెండుసార్లు దుప్పట్లను ఉతికిస్తామని ఉత్తర రైల్వే ప్రకటించింది. UV రోబోటిక్ శానిటైజేషన్ ద్వారా వాటిని శుభ్రం చేయిస్తామని తెలిపింది. 2010కి ముందు 2-3 నెలలకొకసారి బ్లాంకెట్స్ ఉతికేవారని రైల్వే ప్రతినిధులు ఒకరు అన్నారు.
Similar News
News January 12, 2026
సీబీఐ విచారణకు విజయ్

కరూర్ తొక్కిసలాట కేసులో హీరో, టీవీకే చీఫ్ విజయ్ దళపతి సీబీఐ విచారణకు హాజరయ్యారు. ఢిల్లీలోని సీబీఐ ఆఫీస్లో అధికారులు ఆయనను విచారిస్తున్నారు. గతేడాది సెప్టెంబర్ 27న విజయ్ ప్రచార సభలో తొక్కిసలాట జరిగి 41 మంది మరణించారు. సుప్రీంకోర్టు ఆదేశాలతో ఈ కేసును సీబీఐ దర్యాప్తు చేస్తోంది.
News January 12, 2026
మంత్రులు, అధికారులతో CM CBN కీలక భేటీ

AP: మంత్రులు, వివిధ శాఖల ముఖ్య కార్యదర్శులతో సీఎం చంద్రబాబు సచివాలయంలో కీలక సమావేశం నిర్వహిస్తున్నారు. రాష్ట్రాభివృద్ధి, పారదర్శక పాలన, మెరుగైన ప్రజా సేవలపై ఆయన సమీక్షిస్తున్నారు. జీఎస్డీపీ, ఆర్టీజీఎస్, పట్టాదారు పాస్ పుస్తకాలపైనా చర్చించనున్నారు. ఈ సమావేశంలో అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు కూడా వర్చువల్గా హాజరుకానున్నారు.
News January 12, 2026
మేడారం వెళ్తున్నారా? రూట్ మ్యాప్ ఇదే

TG: మేడారం జాతరకు ఈసారీ వన్ వే అమలు చేస్తున్నారు. WGL మీదుగా వచ్చే ప్రైవేటు వాహనాలను పస్రా టూ నార్లాపూర్ వైపునకు మళ్లిస్తారు. మహారాష్ట్ర, కరీంనగర్, BHPL నుంచి వచ్చే వాహనాలను కాల్వపల్లి మీదుగా ఊరట్టం పార్కింగ్ స్థలాల వరకు అనుమతిస్తారు. ఛత్తీస్గఢ్, ఖమ్మం వాహనాలను చిన్నబోయినపల్లి-కొండాయి నుంచి అనుమతిస్తారు. రిటర్న్ జర్నీకి ఇవే రూట్లు ఫాలో కావాలి. RTC, VIP వాహనాలకు తాడ్వాయి రూట్ను కేటాయించారు.


