News December 2, 2024
5వికెట్లు కోల్పోయినా 6 వికెట్ల తేడాతో భారత్ ఎలా గెలిచింది?

AUS PM XIతో ప్రాక్టీస్ మ్యాచ్లో భారత్ 5 వికెట్లు కోల్పోయినా 6 వికెట్ల తేడాతో గెలిచింది. దీంతో 5 వికెట్ల తేడా కదా? అనే సందేహం చాలామందికి వచ్చింది. అయితే 46ఓవర్ల మ్యాచ్లో మొదట PM XI 43.2 ఓవర్లలో 240/10 స్కోర్ చేసింది. భారత్ 42.5 ఓవర్లలోనే 4 వికెట్ల కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. అయితే ప్రాక్టీస్ మ్యాచ్ కావడంతో గెలిచాక కూడా 46ఓవర్లు పూర్తిగా ఆడింది. లక్ష్యాన్ని ఛేదించాక మరో వికెట్ కోల్పోయింది.
Similar News
News September 17, 2025
BC రిజర్వేషన్లను పెంచేందుకు చర్యలు: మంత్రివర్గ ఉపసంఘం

AP: స్థానిక సంస్థల ఎన్నికల్లోగా BC రిజర్వేషన్లను 34 శాతానికి పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రులు సవిత, కొల్లు రవీంద్ర తెలిపారు. మంత్రివర్గ ఉపసంఘం భేటీలో BC రిజర్వేషన్లపై చర్చించామన్నారు. రిజర్వేషన్లను CBN 34%కి పెంచితే, జగన్ 24%కి తగ్గించారని పేర్కొన్నారు. న్యాయపరిశీలన చేసి రిజర్వేషన్లపై పకడ్బందీ చట్టం తెస్తామన్నారు. త్వరలో BC రక్షణ చట్టానికి తుది రూపం తీసుకురానున్నట్లు చెప్పారు.
News September 17, 2025
కేరళలో PAM కలకలం.. 19 మంది మృతి

కేరళలో ప్రైమరీ అమీబిక్ మెనింగోఎన్సెఫాలిటిస్(PAM) అనే ప్రాణాంతక వ్యాధి కలకలం రేపుతోంది. ఈ ఏడాది ఇప్పటివరకు 61 కేసులు, 19 మరణాలు సంభవించాయి. క్లోరినేషన్ సరిగా లేని నీటిలో ఉండే నేగ్లేరియా ఫౌలెరీ(మెదడును తినే) అమీబా వల్ల ఇది వ్యాపిస్తుంది. ఈత/స్నానం సమయంలో నీటి ద్వారా మనుషుల శరీరంలోకి ప్రవేశించి నాడీ వ్యవస్థను దెబ్బతీస్తుంది. ఈ వ్యాధి సోకితే తలనొప్పి, జ్వరం, వికారం, వాంతులు వంటి లక్షణాలు కనిపిస్తాయి.
News September 17, 2025
ASIA CUP: పాక్-UAE మ్యాచ్ రిఫరీగా పైక్రాఫ్ట్

తమ మ్యాచ్కు రిఫరీగా ఆండీ పైక్రాఫ్ట్ను తప్పించాలన్న పాక్కు ICC షాక్ ఇచ్చింది. పాక్-UAE మ్యాచ్కు అతడినే రిఫరీగా కొనసాగిస్తోంది. మరోవైపు హ్యాండ్ షేక్ వివాదంపై పైక్రాఫ్ట్ తాజాగా తమకు క్షమాపణ చెప్పాడని పీసీబీ క్లెయిమ్ చేసుకోవడం గమనార్హం. అటు మ్యాచులో పాక్కు UAE షాక్ ఇస్తోంది. తొలి ఓవర్లో ఓపెనర్ అయూబ్ను డకౌట్గా వెనక్కి పంపింది. పాక్ 4 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 17 పరుగులు చేసింది.