News December 2, 2024
నిర్మల్: ముస్తాబైన ప్రభుత్వ కార్యాలయాలు

ప్రజాపాలన విజయోత్సవంలో భాగంగా నిర్మల్ జిల్లా కేంద్రంతో పాటు జిల్లాలోని అన్ని మండల కేంద్రాల్లో ప్రభుత్వ కార్యాలయాలను రంగురంగుల విద్యుత్ దీపాలతో ముస్తాబు చేశారు. ఆదివారం సోన్లో మిరుమిట్లు గొలిపే విధంగా స్థానిక పోలీస్ స్టేషన్ స్టేషన్ను అలంకరించారు. కాగా ఈ నెల 9 వరకు ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు.
Similar News
News January 23, 2026
ఆదిలాబాద్: GOVT భూమి కబ్జాకు యత్నం.. 14 మందిపై కేసు

ఆదిలాబాద్ వడ్డెర కాలనీ వాటర్ ట్యాంకు వద్ద మున్సిపల్ అనుమతులు లేకుండా భూమి పూజలు చేసి ప్రభుత్వ స్థలాన్ని కబ్జా చేసేందుకు యత్నించిన 14 మందిపై, మున్సిపల్ కమిషనర్ ఫిర్యాదు మేరకు 2 టౌన్ PSలో కేసు నమోదు చేశామని సీఐ కె.నాగరాజు తెలిపారు. ప్రభుత్వ అధికారులను అడ్డుకుని వాగ్వాదానికి పాల్పడిన వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కబ్జాదారులు ఎవరైనా ఉపేక్షించేది లేదని హెచ్చరించారు.
News January 23, 2026
ఉట్నూర్: పాలిటెక్నిక్ లేటరల్ ఎంట్రీకి దరఖాస్తు ఆహ్వానం

ఐటీఐ పూర్తి చేసి పాలిటెక్నిక్ కళాశాలలో లెటరల్ ఏంట్రీ ద్వారా నేరుగా ద్వితీయ సంవత్సరంలో ప్రవేశాలు కల్పించడానికి ప్రకటన విడుదలైనట్లు ఉట్నూర్ ప్రభుత్వ గిరిజన ఐటీఐ కళాశాల ప్రిన్సిపల్ శ్రీనివాస్ తెలిపారు. ఐటీఐలో 60% మార్కులతో రెండేళ్ల కోర్సు తప్పనిసరిగా పూర్తి చేసి ఉండాలన్నారు. తమ సమీపంలోని ఐటీఐ కళాశాలలో దరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు. అర్హులైన యువత అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.
News January 23, 2026
ఆదిలాబాద్: ఉచిత శిక్షణ కోసం దరఖాస్తుల స్వీకరణ

మైనార్టీ సంక్షేమ శాఖ ద్వారా జూనియర్ సాఫ్ట్వేర్ డెవలపర్, టైలరింగ్ కోర్స్లకు ఉచిత శిక్షణ కోసం మైనార్టీల నుంచి (ముస్లిం, క్రిస్టియన్, సిక్కు, జైనులు, బౌద్ధులు, పార్శీ) దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు ADB DMWO కలీం తెలిపారు. జూనియర్ సాఫ్ట్వేర్ డెవలపర్కు ఇంటర్ , డిగ్రీ, బీటెక్ పూర్తి చేసిన అభ్యర్థులు, టైలరింగ్ కోసం పదో తరగతి పూర్తి చేసిన అభ్యర్థులు అర్హులన్నారు. ఈనెల 28లోపు దరఖాస్తులను ఇవ్వాలన్నారు.


