News December 2, 2024

ఈ జిల్లాలోనే అత్యధిక హెచ్ఐవీ రోగులు

image

AP: రాష్ట్రంలోని 24 జిల్లాల్లో ఎయిడ్స్ వ్యాప్తి అధికంగా ఉన్నట్లు నాక్స్ తెలిపింది. NTR జిల్లాలో అత్యధికంగా 19,865 మంది, అల్లూరి జిల్లాలో అత్యల్పంగా 1,408 మంది HIV రోగులు ఉన్నట్లు వెల్లడించింది. ఏటా రాష్ట్రంలో 3,510 మంది దీని బారిన పడుతున్నట్లు తెలిపింది. కాకినాడ (18,234), తూర్పుగోదావరి (17,618), పల్నాడు (17,536), గుంటూరు (16,630), ప్రకాశం (16,280), విశాఖలో (15,999) మంది రోగులున్నట్లు పేర్కొంది..

Similar News

News March 27, 2026

కేసీఆర్ యాదాద్రి అభివృద్ధి.. రేవంత్ భద్రాద్రిపై ఫోకస్

image

పదేళ్ల పాలనలో యాదాద్రి అభివృద్ధికి ప్రాధాన్యం ఇచ్చిన మాజీ సీఎం కేసీఆర్, భద్రాచలం విషయంలో నిర్లక్ష్యం వహించారనే విమర్శలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి భద్రాద్రిపై ప్రత్యేక దృష్టి సారించి నేడు శ్రీరామనవమి సందర్భంగా అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. తొలి దశలో రూ.351 కోట్లు విడుదల చేసి గోదావరి కరకట్ట, భక్తులకు వసతులు, ఆలయ విస్తరణ వంటి పనులు చేపట్టనున్నారు.

News March 27, 2026

ప్రతి చిన్న విషయానికి సారీ అక్కర్లేదు: సమంత

image

ఒకే పరిస్థితి ఎదురైనప్పుడు మగాళ్లతో పోలిస్తే మహిళలు 10రెట్లు ఎక్కువగా సారీ చెబుతున్నారని నటి సమంత అన్నారు. ప్రతి చిన్న విషయానికి సారీ చెప్పాల్సిన అవసరం లేదని, తమను తాము తగ్గించుకోవడం ఆపాలని కోరారు. ఇక మూవీ ఇండస్ట్రీలో లేడీ యాక్టర్లు గుర్తింపునకు రెట్టింపు కష్టపడాల్సి వస్తోందని చెప్పారు. లేడీ ఓరియంటెడ్ మూవీలను రిస్క్‌లాగా చూడటం ఆపాలని ముంబైలో జరిగిన ఉమెన్ ఇన్ ఎంటర్‌టైన్‌మెంట్ ప్రోగ్రాంలో తెలిపారు.

News March 27, 2026

బ్లడ్‌బాత్.. ₹9 లక్షల కోట్లు ఆవిరి

image

దేశీయ స్టాక్ మార్కెట్లు ఇవాళ భారీ నష్టాలు చవిచూశాయి. నిఫ్టీ 487 పాయింట్లు కోల్పోయి 22,819 వద్ద, సెన్సెక్స్ 1,690 పాయింట్ల నష్టంతో 73,583 వద్ద ముగిశాయి. దీంతో ఒక్కరోజే ₹9 లక్షల కోట్లు ఆవిరయ్యాయి. టాటా మోటార్స్, రిలయన్స్, బజాజ్ ఫైనాన్స్ షేర్లు నష్టపోగా, ONGC, TCS, విప్రో, ఎయిర్‌టెల్, కోల్ ఇండియా షేర్లు లాభపడ్డాయి. రూపాయి విలువ డాలర్‌తో పోలిస్తే ఆల్ టైమ్ కనిష్ఠానికి(94.82) పడిపోయింది.