News December 2, 2024

అధికారులు అప్రమత్తంగా ఉండాలి: అనిత

image

AP: ‘ఫెంగల్’ తుఫాను ప్రభావిత జిల్లాల అధికారులు అప్రమత్తంగా ఉండాలని హోంమంత్రి అనిత ఆదేశించారు. అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి కలెక్టర్లతో సమీక్ష నిర్వహించారు. స్వర్ణముఖి నది సహా నాయుడుపేట, పెళ్లకూరు, ఓజిలి మండలాల్లో పొంగిపొర్లుతున్న వాగులు, వంకల పరిసరాల ప్రజలను అప్రమత్తం చేయాలని సూచించారు. తిరుపతి, తిరుమలలో కొండచరియలు జారిపడుతున్న నేపథ్యంలో భక్తులు, ప్రజల రాకపోకలు, భద్రతపై దృష్టి పెట్టాలని చెప్పారు.

Similar News

News November 9, 2025

శబరిమలకు ప్రత్యేక రైళ్లు.. ఇవాళ్టి నుంచి బుకింగ్

image

అయ్యప్పస్వామిని దర్శించుకునేందుకు శబరిమలకు వెళ్లే భక్తుల కోసం తెలుగు రాష్ట్రాల నుంచి SCR <<18224903>>మరిన్ని<<>> ప్రత్యేక రైళ్లు నడపనుంది. కాకినాడ టౌన్-కొట్టాయం, కొట్టాయం-కాకినాడ టౌన్, నాందేడ్-కొల్లామ్, కొల్లామ్-నాందేడ్, చర్లపల్లి-కొల్లామ్, కొల్లామ్-చర్లపల్లి మీదుగా 54 రైళ్లు నడపనున్నట్లు ఓ ప్రకటనలో పేర్కొంది. ఇవాళ ఉ.8 గంటల తర్వాత నుంచి ఈ రైళ్లకు సంబంధించిన బుకింగ్ ప్రారంభం కానుందని IRCTC వెల్లడించింది.

News November 9, 2025

రెబకినా సంచలనం..

image

సౌదీ అరేబియాలోని రియాద్‌లో జరిగిన WTA సింగిల్స్ ఫైనల్‌లో రెబకినా విజయం సాధించారు. ప్రపంచ నం.1 టెన్నిస్ ప్లేయర్ సబలెంకాతో జరిగిన మ్యాచులో పూర్తి ఆధిపత్యం ప్రదర్శించారు. దీంతో మ్యాచ్ వన్ సైడ్ కాగా 6-3, 7-6 పాయింట్లతో ఆమె టైటిల్ గెలిచారు. ఈ విజయంతో రికార్డు స్థాయిలో 5.2 మిలియన్ డాలర్ల ప్రైజ్ మనీ రెబకినా ఖాతాలో చేరనుంది. ఈ ట్రోఫీ అందుకున్న తొలి ఆసియన్, కజికిస్థాన్ ప్లేయర్‌గానూ ఆమె నిలిచారు.

News November 9, 2025

నవంబర్ 9: చరిత్రలో ఈరోజు

image

* 1877: కవి మహమ్మద్ ఇక్బాల్ జననం
* 1895: ఆధునిక ఆంధ్ర కవి దువ్వూరి రామిరెడ్డి జననం
* 1924: రచయిత, కథకుడు కాళీపట్నం రామారావు జననం
* 1978: సినీనటుడు రాజా పుట్టినరోజు
* 2005: మాజీ రాష్ట్రపతి కేఆర్ నారాయణన్ మరణం
* 2009: నోబెల్ గ్రహీత హర‌గోబింద్ ఖురానా మరణం(ఫొటోలో)
* జాతీయ న్యాయ సేవల దినోత్సవం