News December 2, 2024

ఆసక్తి గల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు: మంత్రి

image

రాష్ట్రంలోనే మొదటి <<14768413>>DSC ఫ్రీ కోచింగ్ సెంటర్‌<<>>ను పార్వతీపురంలో మొదలు పెట్టామని మంత్రి గుమ్మిడి సంధ్యారాణి తెలిపారు. సీతంపేట ఐటీడీఏలో కూడా కోచింగ్ సెంటర్ ఏర్పాటు చేస్తామన్నారు. మొత్తం 236 మంది దరఖాస్తు చేసుకోగా.. వారిలో ST-144 SC-44,BC-42, ఐదుగురు ఓసీలు అప్లే చేసుకున్నారని వెల్లడించారు. ఇంకా ఎవరైనా ఆసక్తి గల వారు ఉంటే వారికి కూడా ఫ్రీ కోచింగ్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని పేర్కొన్నారు.

Similar News

News December 29, 2025

PGRS ఫిర్యాదుల్లో 95 శాతం పరిష్కరించాం: VZM SP

image

2025లో పబ్లిక్ గ్రీవెన్స్ రిడ్రెసల్ సిస్టమ్ (PGRS) ద్వారా జిల్లాలో 2,038 ఫిర్యాదులు స్వీకరించగా, వాటిలో 1,930 ఫిర్యాదులను పరిష్కరించామని జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్ తెలిపారు. ఇంకా 108 ఫిర్యాదులు పెండింగ్‌లో ఉన్నాయన్నారు. మొత్తం ఫిర్యాదుల్లో 95 శాతం పరిష్కారం జరిగిందని వెల్లడించారు. ఫిర్యాదుల్లో ఎక్కువగా భూవివాదాలు, కుటుంబ తగాదాలకు సంబంధించినవే ఉన్నాయని ఎస్పీ పేర్కొన్నారు.

News December 29, 2025

VZM: ఓపెన్ డ్రింకింగ్ చేస్తున్న ఐదుగురిపై కేసు నమోదు

image

విజయనగరం 1వ పట్టణ పోలీసు స్టేషన్ పరిధిలో డ్రోన్లతో నిఘా పెట్టి ఓపెన్ డ్రింకింగ్ చేస్తున్న 5 మందిపై కేసులు నమోదు చేసినట్లు జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్ ఆదివారం తెలిపారు. అయ్యన్నపేట శివారు ప్రాంతం, కలెక్టర్ కార్యాలయం, పీజీఆర్ ఆసుపత్రి పరిసరాల్లో డ్రోన్ల సహాయంతో రైడ్స్ నిర్వహించామని చెప్పారు. నేర నియంత్రణ, అసాంఘిక కార్యకలాపాల అరికట్టేందుకు డ్రోన్ల వినియోగం కొనసాగుతుందని ఎస్పీ స్పష్టం చేశారు.

News December 29, 2025

విజయనగరంలో నేడు ఉదయం 10 గంటలకే ప్రారంభం

image

జిల్లా ప్రజల సమస్యల పరిష్కారానికి సోమవారం ఉదయం కలెక్టరేట్ ఆడిటోరియంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక (PGRS) నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ రాంసుందర్ రెడ్డి తెలిపారు. ఉదయం 10 గంటలు నుంచి 1 గంటల వరకు జరిగే ఈ కార్యక్రమంలో అన్ని శాఖల జిల్లా అధికారులు పాల్గొని అర్జీలు స్వీకరిస్తారన్నారు. మండల కేంద్రాలు, మున్సిపాలిటీల్లోనూ అర్జీల స్వీకరణ ఉంటుందని, ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.