News December 2, 2024
మధ్యాహ్న భోజనం నిర్వాహకులకు భారంగా ‘!

జిల్లాలో కోడిగుడ్డు ధరలు మరింత పెరిగాయి. ఒక్కసారిగా గుడ్డు ధర పెరగడంతో మధ్యాహ్న భోజన పథక నిర్వాహకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల గుడ్డు ధర రూ.6లు ఉండగా ఇప్పుడు రూ.7కు చేరింది. విద్యార్థులకు మధ్యాహ్న భోజన మెనూ ప్రకారం 3 రోజులు కోడి గుడ్లు విద్యార్థులకు అందించాల్సి ఉంది. ప్రభుత్వం మాత్రం మధ్యాహ్న భోజన కార్మికులకు ఒక్కో గుడ్డుకు రూ.5 మాత్రమే చెల్లిస్తుండడంతో తమపై అదనపు భారం పడుతుందన్నారు.
Similar News
News February 3, 2026
నల్గొండ: చెట్టుపై నుంచి బావిలో పడి కాపరి మృతి

కేతేపల్లి మండలంలో విషాదం చోటుచేసుకుంది. తుంగతుర్తి గ్రామానికి చెందిన మేకల కాపరి జటంగి సైదులు ప్రమాదవశాత్తు బావిలో పడి మృతి చెందారు. సోమవారం మేకల మేత కోసం చెట్టు కొమ్మలు కొడుతుండగా కాలు జారి పక్కనే ఉన్న వ్యవసాయ బావిలో పడిపోయారు. దీంతో ఆయన అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మృతునికి భార్య, కుమారుడు ఉన్నారు. ఈ ఘటనతో గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి.
News February 3, 2026
NLG: B.P.Ed &D.P.Ed విద్యార్థులకు గమనిక

మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయం పరిధిలో B.P.Ed & D.P.Ed సెమిస్టర్-1 రెగ్యులర్ సంబంధిచి పరీక్షలో స్వల్ప మార్పు చేస్తున్నట్లు కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్ డాక్టర్ ఉపేందర్రెడ్డి తెలిపారు. ఈనెల 11వ తారీఖున మున్సిపల్ ఎన్నికలు కారణంగా ఆరోజు జరగవలసిన పరీక్షను 13వ తేదీకి రీ-షెడ్యూల్ చేసినట్లు ప్రకటించారు. ఈ విషయాన్ని సంబంధిత కళాశాలలు, విద్యార్థులు గమనించాలని ఆయన కోరారు.
News February 3, 2026
NLG: MA హిస్టరీ, టూరిజం పరీక్షల షెడ్యూల్ ఇదే.!

మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయం పరిధిలో MA హిస్టరీ, టూరిజం సెమిస్టర్-1( R-25) సంబంధించిన పరీక్షల టైం టేబుల్ని యూనివర్సిటీ అధికారులు ప్రకటించారు. ఈనెల 10 నుంచి 20 మధ్య పరీక్షలు జరుగుతాయని కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్ డాక్టర్ ఉపేందర్రెడ్డి తెలిపారు. సంబంధిత కళాశాలలు, విద్యార్థులు ఈ విషయాన్ని గమనించాలని ఆయన కోరారు. పూర్తి పరీక్షల టైం టేబుల్కు అధికారిక ఎంజీయూ వెబ్సైట్ను సందర్శించాలన్నారు.


