News December 2, 2024
విజయవాడ-అమరావతి, విశాఖ మెట్రోకు ప్రభుత్వం ఆమోదం
AP: విజయవాడ-అమరావతి, విశాఖ మెట్రో రైలు ప్రాజెక్టు తొలిదశ డీపీఆర్కు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. విశాఖ మెట్రో ప్రాజెక్టులో 46.23kms మేర 3 కారిడార్లను నిర్మించనుంది. వైజాగ్ స్టీల్ ప్లాంట్ నుంచి కొమ్మాది వరకు ఒకటో కారిడార్(34.4kms), గురుద్వార-పాత పోస్టాఫీసు (5.08kms) రెండో కారిడార్, తాడిచెట్లపాలెం-చినవాల్తేర్ (6.75kms) మూడో కారిడార్ను నిర్మించనుంది. తొలి దశలో నిర్మాణాలకు ₹11,498cr ఖర్చవుతుందని అంచనా.
Similar News
News February 5, 2025
రిజర్వేషన్ల కోసమే కులగణన: టీపీసీసీ చీఫ్
TG: రిజర్వేషన్ల కోసమే రాష్ట్రంలో కులగణన సర్వే చేపట్టినట్లు TPCC చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ తెలిపారు. పీసీసీలోనూ బీసీ, ఎస్సీ, ఎస్టీలకు 60 శాతం రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పారు. ‘రాష్ట్రంలో 3.6 శాతం మందే సర్వేలో పాల్గొనలేదు. వీరిలో ఎక్కువగా హైదరాబాద్లోనే ఉన్నారు. అలాగే పార్టీలో ఎంతటివారైనా నియమ నిబంధనలకు కట్టుబడి ఉండాలి. రూల్స్ పాటించని వారిపై కచ్చితంగా చర్యలు ఉంటాయి’ అని ఆయన హెచ్చరించారు.
News February 5, 2025
పేరు మార్పు: ఫోర్ట్ విలియమ్ ఇకపై ‘విజయ్ దుర్గ్’
కోల్కతాలోని ఇండియన్ ఆర్మీ ఈస్ట్రన్ కమాండ్ హెడ్ క్వార్టర్స్ పేరును మార్చినట్టు తెలిసింది. ఫోర్ట్ విలియమ్ బదులు ‘విజయ్ దుర్గ్’గా వ్యవహరిస్తున్నట్టు సమాచారం. 2023, DECలోనే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని డిఫెన్స్ మినిస్ట్రీ PR, వింగ్ కమాండర్ హిమాన్షు తివారీ చెప్పారని TOI తెలిపింది. అధికారికంగా ప్రకటించనప్పటికీ ఇంటర్నల్ కమ్యూనికేషన్లో విజయ్దుర్గ్నే వాడుతున్నట్టు చెప్పారని వెల్లడించింది.
News February 5, 2025
23న శ్రీశైలానికి సీఎం చంద్రబాబు
AP: శ్రీశైలం బ్రహ్మోత్సవాలు ఈ నెల 19- మార్చి 1 వరకు నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా CM చంద్రబాబు 23న స్వామి, అమ్మవార్లకు పట్టువస్త్రాలు సమర్పిస్తారని ఆలయ అధికారులు తెలిపారు. ఏర్పాట్లను వేగవంతంగా పూర్తి చేసేందుకు దేవస్థాన యంత్రాంగం కృషి చేస్తోంది. పాతాళగంగ వద్ద రక్షణ కంచెలు, మహిళలు బట్టలు మార్చుకునే గదులకు మరమ్మతులు చేస్తున్నారు. అటు శివ దీక్ష భక్తుల కోసం ప్రత్యేక క్యూ లైన్లు ఏర్పాటు చేస్తున్నారు.