News December 3, 2024

అర్జీల పరిష్కారానికి చర్యలు తీసుకుంటాం: ప.గో జిల్లా ఎస్పీ

image

పాలకోడేరు మండలం గొల్లలకోడేరులోని జిల్లా ఎస్పీ కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదికను సోమవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎస్పీ అద్నాన్ నయీం అస్మి పాల్గొని ప్రజల నుంచి వచ్చిన దరఖాస్తులను స్వీకరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. జిల్లా నలుమూలల నుంచి 11 దరఖాస్తులు వచ్చాయన్నారు. వాటిని సంబంధిత పోలీస్ స్టేషన్లకు పంపించి వెంటనే పరిష్కరించే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు.

Similar News

News March 25, 2026

ఏలూరు: శిశువుల విక్రయాలు, కిడ్నాప్స్.. పోలీసుల తీరుపై అనుమానాలు!(1/2)

image

జిల్లాలో పసిపిల్లల విక్రయాలే కాకుండా రెండు సంవత్సరాల మోక్షిత్ కిడ్నాప్ వ్యవహారంపై పోలీసులు పట్టించుకున్న దాఖలాలు లేవనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. పసిపిల్లల విక్రయాల కేసులో జనసేన మండల నాయకుడు అనిశెట్టి నాగబాబు తల్లి వీరమ్మను మాత్రమే అరెస్టు చేశారు. ఇందులో నాగబాబు, అదేవిధంగా మరో నాయకుడు ఆంజనేయులు అలియాస్ అంజిబాబు ఉన్నప్పటికీ వారిని అదుపులోకి తీసుకోలేదు.

News March 25, 2026

పెట్రోల్, గ్యాస్ కొరత ఉందా? ప.గో కలెక్టర్ క్లారిటీ!

image

ప.గో జిల్లాలో పెట్రోల్, డీజిల్, గ్యాస్ నిల్వలు సరిపడా ఉన్నాయని, ప్రజలు ఆందోళన చెందవద్దని కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు. సరఫరాలో ఎటువంటి కొరత లేదని స్పష్టం చేశారు. వినియోగదారులకు ఏవైనా ఇబ్బందులు ఎదురైతే ఉదయం 8 నుంచి రాత్రి 8 గంటల లోపు 8121676653 కాల్ సెంటర్ నంబరుకు ఫిర్యాదు చేయవచ్చని ఆమె సూచించారు.

News March 25, 2026

ఈనెల 25 నుంచి సదరం స్లాట్ బుకింగ్: కలెక్టర్

image

ప.గో జిల్లాలో దివ్యాంగులకు సదరం ధ్రువపత్రాల జారీని మరింత సులభతరం, పారదర్శకం చేసేందుకు డిజిటల్ విధానం అమలు చేస్తున్నట్లు కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు. ఈనెల 25 బుధవారం నుంచి సదరం స్లాట్ బుకింగ్ ప్రారంభమవుతుందని పేర్కొన్నారు. దివ్యాంగత్వ నిర్ధారణ పరీక్షల నిమిత్తం మార్చి 30, 31 తేదీలతో పాటు ఏప్రిల్, మే నెలలకు కూడా ముందస్తు టోకెన్లు జారీ చేయనున్నట్లు ఆమె స్పష్టం చేశారు.