News December 3, 2024

MBNR: ఉమ్మడి జిల్లాలో ఈ మండలాలు ఇక ప్రజా పరిషత్!

image

ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని కొత్తగా ఏర్పడిన మండలాలు ఇకపై మండల ప్రజా పరిషత్లుగా ఏర్పాటు కానున్నాయి. మహబూబ్ నగర్ జిల్లాలో మహమ్మదాబాద్, కౌకుంట్ల, గద్వాల్ జిల్లాలో ఎర్రవల్లి, వనపర్తి జిల్లాలో యేదుల, నారాయణపేట జిల్లాలో గుండుమల్, కొత్తపల్లి మండలాల్లో స్థానిక సంస్థల ఎన్నికలు జరిగితే వీటికి ప్రత్యేకంగా జెడ్పీటీసీ సభ్యులు, ఎంపీపీ అధ్యక్షులు రానున్నారు. ఇప్పటికే ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

Similar News

News January 19, 2026

మహబూబ్‌నగర్: ఉచిత శిక్షణను సద్వినియోగం చేసుకోవాలి: కలెక్టర్

image

జిల్లా ఎస్సీ స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో గ్రూప్స్, బ్యాంకింగ్, రైల్వే ఉద్యోగాల కోసం ఇచ్చే ఐదు నెలల ఉచిత శిక్షణ కరపత్రాలను కలెక్టర్ విజయేందిర బోయి ఆవిష్కరించారు. డిగ్రీ అర్హత గల ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ అభ్యర్థులు ఈ నెల 30లోగా https://www.tsstudycircle.co.in వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని ఆమె సూచించారు.

News January 19, 2026

MBNR: రోడ్డు ప్రమాదం.. ఒకరి మృతి

image

భూత్పూర్ మండలం తాటికొండ వద్ద ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో యువకుడు <<18892567>>ప్రాణాలు<<>> కోల్పోయాడు. SI చంద్రశేఖర్ వివరాలు.. కోయిలకొండ మండలం కొతలబాద్‌కు చెందిన రవికుమార్(26) తన స్నేహితుడిని కలిసేందుకు బైక్‌పై వెళ్తుండగా అన్నాసాగర్‌కు చెందిన ఆకాశ్ బైక్ ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ఘటనలో రవికుమార్ అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడికి ఏడాది క్రితమే వివాహం కాగా, బాబు ఉన్నాడు. పోలీసులు కేసు నమోదు చేశారు.

News January 18, 2026

జడ్చర్ల: సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు దురదృష్టకరం: లక్ష్మారెడ్డి

image

మాజీ మంత్రులు హరీశ్ రావు, KTRలపై సీఎం రేవంత్ చేసిన వ్యాఖ్యలను మాజీ మంత్రి లక్ష్మారెడ్డి తీవ్రంగా ఖండించారు. ప్రతిపక్ష నేతలను మారీచుడు, సుబాహుడు అని సంబోధించడం, “నడుం విరగ్గొడతా” అని మాట్లాడటం నీచమని మండిపడ్డారు. కేసీఆర్ హయాంలోనే ప్రతి జిల్లాకు మెడికల్ కాలేజీలు వచ్చాయని, ప్రపంచంలోనే అతిపెద్ద మోటార్లతో ప్రాజెక్టులు నిర్మించామని గుర్తుచేశారు. తాము ఎన్నడూ అభివృద్ధికి అడ్డుపడలేదని స్పష్టం చేశారు.