News December 3, 2024

శ్రీశైలం మల్లన్న దర్శనాల్లో పలు మార్పులు!

image

ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రం, అష్టాదశ శక్తి పీఠాల్లో ఒకటైన <<14776158>>శ్రీశైల<<>> క్షేత్రంలో స్వామి, అమ్మవార్ల దర్శనాల్లో ఆలయ ఈవో చంద్రశేఖర్ ఆజాద్ పలు మార్పులకు శ్రీకారం చుట్టారు. భక్తుల రద్దీ దృష్ట్యా ప్రతి శని, ఆది, సోమవారాలు, ప్రభుత్వ సెలవు రోజులు, దేవస్థాన వైదిక కమిటీ నిర్ధారించిన రోజుల్లో భక్తులందరికీ కేవలం స్వామి వారి అలంకార దర్శనం మాత్రమే కల్పించేందుకు నిర్ణయం తీసుకున్నారు.

Similar News

News February 5, 2025

కర్నూలు APSP బెటాలియన్ కమాండెంట్‌గా దీపిక బాధ్యతల స్వీకరణ

image

కర్నూలు ఏపీఎస్పీ 2వ బెటాలియన్ కమాండెంట్‌గా దీపిక పాటిల్ బుధవారం బాధ్యతలు స్వీకరించారు. అనంతరం విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. పోలీసుల సంక్షేమానికి నిరంతరం కృషి చేస్తానని వెల్లడించారు. ముందుగా బెటాలియన్ అధికారుల నుంచి ఆమె గౌరవ వందనం స్వీకరించారు. అడిషనల్ కమాండెంట్ మెహబూబ్ బాషా, తదితరులు పాల్గొన్నారు.

News February 5, 2025

కుటుంబానికి 100 రోజులు పని కల్పించాలి: కలెక్టర్

image

ఉపాధి హామీ పథకం ద్వారా ప్రతి రోజూ లక్ష మందికి ఉపాధి పనులు కల్పించాలని ఏపీడీ, ఎంపీడీవో, ఏపీవోలను కలెక్టర్ రంజిత్ బాషా ఆదేశించారు.ఉపాధి హామీ పనుల పురోగతి అంశంపై ఏపీడీలు, ఎంపీడీవోలు, ఏపీవోలతో కలెక్టర్ టెలికాన్ఫరెన్స్ ద్వారా బుధవారం సమీక్ష నిర్వహించారు. పనుల కల్పనలో వెనుకబడిన అధికారులతో మాట్లాడారు. కుటుంబానికి 100 రోజుల పని కల్పించాలన్నారు.

News February 5, 2025

పారా అథ్లెటిక్స్‌లో ఎమ్మిగనూరు డిగ్రీ విద్యార్థి ఘనత

image

గుంటూరు జిల్లా మంగళగిరిలో ఈనెల 2న జరిగిన 7వ రాష్ట్రస్థాయి పారా అథ్లెటిక్స్‌లో ఎమ్మిగనూరు శ్రీ మహాయోగి లక్ష్మమ్మ ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థి పింజారి బషీర్ సత్తా చాటాడు. 100 మీటర్లు, 1,500 మీటర్ల పరుగు పందెంలో మొదటి స్థానం సాధించాడు. ఈ విజయంతో కళాశాలకు రాష్ట్రస్థాయిలో గుర్తింపు వచ్చిందని కళాశాల అధ్యక్షుడు డా.మహబూబ్ బాషా పేర్కొన్నారు. బషీర్‌ను కళాశాల అధ్యాపక సిబ్బంది అభినందించారు.

error: Content is protected !!