News December 3, 2024
లోక్సభలో ప్రియాంకా గాంధీ సీట్ నంబర్ ఇదే!

18వ లోక్సభలో ఎంపీలు కూర్చునే సీట్ల నంబర్లను ఫైనల్ చేశారు. ప్రధాని మోదీకి నంబర్ 1, రాజ్నాథ్ సింగ్కు 2, అమిత్ షాకు 3.. గడ్కరీకి 58 నుంచి 4వ సీటును కేటాయిస్తూ సోమవారం సర్క్యులర్ జారీ చేశారు. ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీకి 498వ సీట్, ఆయన పక్కన కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ కూర్చోనున్నారు. ఇటీవల వయనాడ్ ఉపఎన్నికలో గెలిచిన ప్రియాంకా గాంధీకి 4వ వరుసలోని 517వ నంబర్ సీటు కేటాయించారు.
Similar News
News March 5, 2026
యువతకు సాంకేతిక నైపుణ్యం అవసరం: కలెక్టర్ అనురాగ్ జయంతి

యువత సాంకేతిక నైపుణ్యాలు పెంపొందించుకుంటేనే మెరుగైన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని కలెక్టర్ అనురాగ్ జయంతి అన్నారు. గురువారం ఆలేరులోని అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్ (ATC), ఐటిఐలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. రోబోటిక్స్, డిజిటల్ మ్యానుఫ్యాక్చరింగ్ వంటి కోర్సుల శిక్షణను పరిశీలించి, విద్యార్థులతో ముచ్చటించారు. సృజనాత్మక ఆలోచనలతో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని సూచించారు. ప్రిన్సిపల్ హరికృష్ణ పాల్గొన్నారు.
News March 5, 2026
మంత్రి, ఎమ్మెల్యేలకు తప్పిన ప్రమాదం!

AP: కృష్ణా(D) గన్నవరం ఎయిర్పోర్టులో ఇండిగో ఫ్లైట్ ఎమర్జెన్సీ ల్యాండైంది. HYDకు వెళ్లాల్సిన విమానం టేకాఫ్ అవుతుండగా ఇంజిన్లో సాంకేతిక లోపాన్ని పైలట్ గుర్తించి వెంటనే నిలిపేశారు. ఈ ఫ్లైట్లో మంత్రి గొట్టిపాటి రవి, MLAలు లక్ష్మీనారాయణ, పుల్లారావుతో పాటు 70 మంది ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో పలువురు రోడ్డు మార్గాన బయలుదేరగా ఇతరులకు వేరే విమానం ఏర్పాటు చేయనున్నట్లు ఇండిగో ప్రకటించింది.
News March 5, 2026
ఏ వివాదానికైనా సైనిక చర్య పరిష్కారం కాదు: మోదీ

దేశాల మధ్య సంఘర్షణను పరిష్కరించడానికి చట్టబద్ధ పాలన, చర్చలు, దౌత్యం ముఖ్యమని PM మోదీ చెప్పారు. రష్యాvsఉక్రెయిన్, US-ఇజ్రాయెల్vsఇరాన్ యుద్ధాలను ప్రస్తావిస్తూ.. ఏ వివాదానికైనా సైనిక చర్య పరిష్కారం కాదన్నారు. ఢిల్లీలో ఫిన్లాండ్ ప్రెసిడెంట్ అలెగ్జాండర్ స్టబ్తో కలిసి నిర్వహించిన ప్రెస్మీట్లో ఈ కామెంట్లు చేశారు. ఉక్రెయిన్, పశ్చిమాసియాలో శాంతి కోసం చేసే ప్రయత్నాలకు సపోర్ట్ చేస్తామని ప్రకటించారు.


