News December 3, 2024

లండన్ వీధుల్లో.. మన హైదరాబాదీ గొంతు

image

HYDలోని ఉప్పల్‌కు చెందిన భరత్ ‘గుడ్ మార్నింగ్ లండన్’ అంటూ రేడియో జాకీగా శ్రోతలను మెప్పిస్తున్నారు. UKలో MS చేసి, బిజినెస్ ఇంటెలిజెన్స్ డెవలపర్‌గా జాబ్ చేస్తున్న భరత్‌కు ప్రజలతో మమేకమవడం ఇష్టం. అందుకే జాబ్ చేస్తూనే RJగా మారారు. అక్కడి SPICE FMలో గొప్పవ్యక్తుల జీవిత విశేషాలను చెబుతూ తన గొంతుతో రేడియో ప్రియులను ఆకట్టుకుంటున్నారు. ఎంతోమంది తనను ఫోన్‌లో మెచ్చుకుంటుంటే ఆ తృప్తి వేరని భరత్ అంటున్నారు.

Similar News

News March 24, 2026

పీఎం పథకాలపై అవగాహన కల్పించాలి : కలెక్టర్

image

పర్యావరణ హిత ఇంధన వనరులను ప్రోత్సహించేందుకు ‘పీఎం సూర్య ఘర్’ (రూఫ్ టాప్ సోలార్), ‘పీఎం కుసుమ్’ పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని కలెక్టర్ రాజర్షి షా కోరారు. రూఫ్ టాప్ సోలార్ ఏర్పాటుకు ప్రభుత్వం దాదాపు ₹78,000 వరకు సబ్సిడీ అందిస్తోందని తెలిపారు. దీనిని బ్యాంకర్లు తమ లోన్ పోర్ట్‌ఫోలియోలో ముఖ్యమైన భాగంగా చేర్చుకోవాలని పేర్కొన్నారు.

News March 24, 2026

యుద్ధం.. ఇంధన ఎమర్జెన్సీ ప్రకటించిన తొలి దేశం

image

పశ్చిమాసియా సంక్షోభం నేపథ్యంలో ఫిలిప్పీన్స్ ఎనర్జీ ఎమర్జెన్సీని ప్రకటించింది. ప్రపంచంలో ఇలా ప్రకటించిన తొలి దేశంగా నిలిచింది. ఇంధన భద్రత, పెరుగుతున్న విద్యుత్ ధరల నుంచి ప్రజలను రక్షించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు దేశాధ్యక్షుడు ఫెర్డినాండ్ మార్కోస్ తెలిపారు. ఎమర్జెన్సీ ఏడాదిపాటు కొనసాగే అవకాశం ఉంది. ఫిలిప్పీన్స్ దిగుమతి చేసుకునే క్రూడాయిల్‌లో 98% పర్షియన్ గల్ఫ్ నుంచే వస్తుండటం గమనార్హం.

News March 24, 2026

హార్ముజ్‌ను తెరిచి ఉంచడం అత్యవసరం: మోదీ

image

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ నుంచి తనకు <<19466723>>కాల్<<>> వచ్చినట్లు PM మోదీ వెల్లడించారు. పశ్చిమాసియాలో పరిస్థితులపై చర్చించినట్లు తెలిపారు. వీలైనంత త్వరగా ఉద్రిక్తతలను తగ్గించి, శాంతిని పునరుద్ధరించడానికి భారత్ మద్దతు ఇస్తుందని చెప్పారు. హార్ముజ్ జలసంధిని తెరిచి, అందుబాటులో ఉండేలా చూడటం ప్రపంచం మొత్తానికి అత్యవసరం అని పేర్కొన్నారు. శాంతి, స్థిరత్వం దిశగా జరుగుతున్న ప్రయత్నాలపై సంప్రదింపులు కొనసాగిస్తామన్నారు.