News December 3, 2024

SKLM: వారిని స్వదేశానికి తీసుకురావాలని వినతి

image

శ్రీకాకుళం నుంచి ఉపాధి కోసం సౌదీ వెళ్లిన 22 మంది కార్మికులు యాజమాన్యం చేతులో మోసపోవడం బాధాకరమని మంత్రి రామ్మోహన్ నాయుడు అన్నారు. ఈ మేరకు ఆయన కేంద్ర విదేశాంగ మంత్రి జైశంకర్‌ను మంగళవారం మర్యాదపూర్వకంగా కలిశారు. వారిని సౌదీ అరేబియా నుంచి క్షేమంగా స్వదేశానికి తీసుకు వచ్చేందుకు చొరవ చూపాలని కోరారు. అనంతరం వినతిపత్రం అందజేసిన మంత్రి ఎంబసీకి సమాచారం అందించి, వారి బాగోగులను చూడాలన్నారు.

Similar News

News March 19, 2026

రణస్థలం: ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య

image

పరీక్షలు సరిగా రాయలేదని, ఫెయిల్ అవుతానని మనస్థాపం చెంది ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న ఘటన రణస్థలంలో జరిగింది. స్థానిక వెంకటేశ్వర కాలనీకి చెందిన వెంకటేశ్వరరావు(17) ఇంటర్ పరీక్షలు రాశాడు. అయితే ఫెయిల్ అవుతానని భయపడ్డాడు. ఈ క్రమంలో ఇంట్లో ఎవరూ లేని సమయంలో నిన్న సాయంత్రం ఏడు గంటలకు ఫ్యానుకు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. దీంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు.

News March 19, 2026

సిక్కోలులో సైబర్ మోసం

image

శ్రీకాకుళం జిల్లా అరసవల్లిలో సైబర్ మోసం ఘటన ఆలస్యంగా వెలుగులోకొచ్చింది. అరసవల్లిలో నివాసం ఉంటున్న విశ్రాంత బ్యాంకు ఉద్యోగి కె.జయశంకర్, భార్య పుష్పలత ఖాతా నుంచి రూ.2.49 లక్షలు మాయమయ్యాయి. బాధితులు వివరాలు మేరకు ఈనెల 11వ తేదీ రాత్రి బ్యాంకు లావాదేవీల యాప్‌కు సంబంధించి తమ మొబైల్‌కు వచ్చిన ఒక లింక్‌ను క్లిక్ చేయడంతో నగదు డెబిట్ అయినట్లు సందేశాలు రావడంతో బాధితులు పోలీసులను ఆశ్రయించగా కేసు నమోదు చేశారు.

News March 19, 2026

కవిటి: మానసిక వికలాంగురాలిపై అత్యాచారం

image

కవిటి మండలం నెలవంక పంచాయతీ పరిధిలోని ఒక గ్రామంలో ఉంటున్న ఒక మానసిక వికలాంగురాలిపై నెలవంక గ్రామానికి చెందిన ఒక వ్యక్తి అత్యాచారానికి పాల్పడ్డాడు. బాధితురాలి తల్లి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సుమారు వారం రోజుల క్రితం ఆ గ్రామానికి వెళ్లిన వ్యక్తి మానసిక దివ్యాంగురాలిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ మేరకు కవిటి పోలీసులు కేసు నమోదు చేశారు.