News December 3, 2024
సైనిక పాలన ఎత్తివేతకు తీర్మానం

దక్షిణ కొరియాలో సైనిక పాలన ఎత్తివేతకు నేషనల్ అసెంబ్లీ తీర్మానించింది. 300 మంది సభ్యులున్న అసెంబ్లీలో 190 మంది ఈ ఓటింగ్కు హాజరయ్యారు. ఓటింగ్లో పాల్గొన్న ప్రతిఒక్కరూ మూకుమ్మడిగా సైనిక పాలనకు వ్యతిరేకంగా తీర్మానించారు. మరోవైపు అధ్యక్షడు యూన్ ప్రకటనకు వ్యతిరేకంగా పెద్దఎత్తున ప్రజలు అసెంబ్లీ వద్దకు చేరుకుంటున్నారు. బలగాలు వారిని ఎక్కడికక్కడ నిలువరించే ప్రయత్నాలు చేస్తున్నాయి.
Similar News
News October 14, 2025
పుట్టినప్పుడు 306.. పెరిగాక 206 ఎముకలు!

శిశువులు సుమారు 306 ఎముకలతో <<18001798>>పుడితే<<>> యుక్తవయస్సు వచ్చేసరికి అవి 206కి తగ్గుతాయి. మిగిలిన 100 ఎముకలు ఏమయ్యాయనే సందేహం మీకు వచ్చిందా? శిశువులకు మెదడు పెరుగుదల కోసం, ప్రసవ సమయంలో సులభంగా బయటకు వచ్చేందుకు వీలుగా పుర్రెలోని ఎముకలు విడివిడిగా ఉంటాయి. పిల్లలు పెరిగేకొద్దీ ఈ చిన్న ఎముకలు, మృదులాస్థి భాగాలు గట్టిపడి ఒకే పెద్ద ఎముకగా ఏర్పడతాయి. పుర్రె ఎముకలు, వెన్నెముక & కటి ఎముకలు కలిసిపోతాయి.
News October 14, 2025
హర్షిత్ ఎంపికపై విమర్శలు.. గంభీర్ ఆగ్రహం

AUSతో సిరీస్కు హర్షిత్ రాణాను ఎంపిక చేయడంపై వచ్చిన <<17920712>>విమర్శలపై<<>> కోచ్ గంభీర్ తీవ్రంగా స్పందించారు. ‘యూట్యూబ్ ఛానెల్స్ వ్యూస్ కోసం 23ఏళ్ల పిల్లాడి గురించి ఇలా ప్రచారం చేయకండి. అతడి తండ్రి మాజీ ఛైర్మనో, మాజీ క్రికెటరో, ఎన్నారైనో కాదు. ఇప్పటివరకు సొంతంగా కష్టపడి ఆడిన అతడిని టార్గెట్ చేయడం సరికాదు. భవిష్యత్తులో మీ పిల్లల్ని కూడా ఎవరో ఒకరు టార్గెట్ చేయొచ్చని గుర్తుంచుకోండి’ అని ఘాటు వ్యాఖ్యలు చేశారు.
News October 14, 2025
మిథున్ రెడ్డి నివాసాల్లో సిట్ తనిఖీలు

AP: హైదరాబాద్, బెంగళూరు, తిరుపతిలోని వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి నివాసాలు, కార్యాలయాలపై సిట్ రైడ్స్ చేస్తోంది. లిక్కర్ స్కాం కేసులో అరెస్టైన ఆయన ఇటీవలే బెయిల్పై విడుదలయ్యారు. ఈక్రమంలో మరోసారి సిట్ తనిఖీలు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది.