News December 4, 2024
రాజమండ్రి: ‘ఇంటర్ విద్యార్థులకు గమనిక’

2025 సంవత్సరం మార్చి నెలలో జరగనున్న ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలకు ఇప్పటివరకు పరీక్ష ఫీజు చెల్లించని విద్యార్థులు డిసెంబర్ 5వ తేదీ లోగా అపరాధ రుసుము లేకుండా చెల్లించవచ్చునని తూ.గో జిల్లా బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ఆర్ ఐఓఎన్ఎస్వి ఎల్. నరసింహం మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ మేరకు జనరల్, ఓకేషనల్ కోర్సులు చదువుతున్న ఇంటర్మీడియట్ విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.
Similar News
News April 18, 2026
నిడదవోలులో ఈనెల 18న సీఎం పర్యటన

సీఎం చంద్రబాబు శనివారం జిల్లాలో పర్యటించనున్న నేపథ్యంలో ఐజీ అశోక్ కుమార్, ఎస్పీ నరసింహ కిషోర్ శుక్రవారం ఏర్పాట్లను పరిశీలించారు. హెలిప్యాడ్, సభా ప్రాంగణం, పార్కింగ్ స్థలాలను సందర్శించి భద్రతా పరమైన సూచనలు చేశారు. సీఎం రాకపోకల సమయంలో ఎటువంటి అంతరాయం కలగకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ముఖ్యంగా సాధారణ ప్రజలకు ఇబ్బంది కలగకుండా ట్రాఫిక్ను క్రమబద్ధీకరించాలన్నారు.
News April 18, 2026
నిడదవోలులో ఈనెల 18న సీఎం పర్యటన

సీఎం చంద్రబాబు శనివారం జిల్లాలో పర్యటించనున్న నేపథ్యంలో ఐజీ అశోక్ కుమార్, ఎస్పీ నరసింహ కిషోర్ శుక్రవారం ఏర్పాట్లను పరిశీలించారు. హెలిప్యాడ్, సభా ప్రాంగణం, పార్కింగ్ స్థలాలను సందర్శించి భద్రతా పరమైన సూచనలు చేశారు. సీఎం రాకపోకల సమయంలో ఎటువంటి అంతరాయం కలగకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ముఖ్యంగా సాధారణ ప్రజలకు ఇబ్బంది కలగకుండా ట్రాఫిక్ను క్రమబద్ధీకరించాలన్నారు.
News April 17, 2026
సెన్సస్–2027: స్వీయ నమోదును వినియోగించుకోండి: కలెక్టర్

జనగణన (సెన్సస్–2027)లో భాగంగా కేంద్ర ప్రభుత్వం కల్పించిన స్వీయ నమోదు అవకాశాన్ని జిల్లా ప్రజలందరూ స్వచ్ఛందంగా వినియోగించుకోవాలని కలెక్టర్ కీర్తి చేకూరి కోరారు. గురువారం ఆమె మాట్లాడుతూ.. ఏప్రిల్ 16 నుంచి 30 వరకు ప్రజలు తమ కుటుంబ వివరాలను [https://se.census.gov.in](https://se.census.gov.in) పోర్టల్ ద్వారా ఆన్లైన్లో స్వయంగా నమోదు చేసుకోవచ్చని తెలిపారు.


