News December 4, 2024
రాజమండ్రి: ‘ఇంటర్ విద్యార్థులకు గమనిక’

2025 సంవత్సరం మార్చి నెలలో జరగనున్న ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలకు ఇప్పటివరకు పరీక్ష ఫీజు చెల్లించని విద్యార్థులు డిసెంబర్ 5వ తేదీ లోగా అపరాధ రుసుము లేకుండా చెల్లించవచ్చునని తూ.గో జిల్లా బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ఆర్ ఐఓఎన్ఎస్వి ఎల్. నరసింహం మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ మేరకు జనరల్, ఓకేషనల్ కోర్సులు చదువుతున్న ఇంటర్మీడియట్ విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.
Similar News
News January 15, 2026
తూ.గో: యాంకర్ శ్యామల సంచలన వ్యాఖ్యలు

భక్తుడికి అన్యాయం జరుగుతుంటే దేవుడు చూస్తే ఉరుకోడని వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఆర్.శ్యామల పేర్కొన్నారు. ఫ్లెక్సీ ఘటనలో అరెస్టై, విడుదలైన వైసీపీ కార్యకర్తలను తూర్పు చోడవరంలో బుధవారం ఆమె పరామర్శించారు. వైసీపీ అధినేత జగన్ను ఉద్దేశించి భక్తులకు అన్యాయం జరిగిందంటే దేవుడు ఊరుకోడని, తప్పకుండా స్పందిస్తారని ఆమె వెల్లడించారు. కార్యకర్తలకు భరోసా ఇచ్చి ధైర్యం చెప్పారు.
News January 15, 2026
కొవ్వూరు: కోడిపందేల్లో గెలిస్తే మోటార్ సైకిళ్లు గిఫ్ట్

కొవ్వూరు మండలం ఐపంగిడిలో బుధవారం కోడిపందేల నిర్వాహకులు బంపర్ ఆఫర్లు ప్రకటించారు. పందేల్లో గెలిచిన పుంజుల యజమానులకు మోటార్ సైకిళ్లు బహుమతిగా ఇస్తామని ప్రకటించి, బరుల వద్ద వాటిని ప్రదర్శనకు ఉంచారు. ఒక శిబిరంలో ఆరు పుంజుల పోటీలో నెగ్గిన వారికి, మరోచోట ఇద్దరు విజేతలకు బైక్లు అందజేస్తామన్నారు. పందెం రాయుళ్లను ఆకర్షించేందుకు నిర్వాహకులు ఇలాంటి భారీ ఆఫర్లు ప్రకటించడం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.
News January 15, 2026
కొవ్వూరు: కోడిపందేల్లో గెలిస్తే మోటార్ సైకిళ్లు గిఫ్ట్

కొవ్వూరు మండలం ఐపంగిడిలో బుధవారం కోడిపందేల నిర్వాహకులు బంపర్ ఆఫర్లు ప్రకటించారు. పందేల్లో గెలిచిన పుంజుల యజమానులకు మోటార్ సైకిళ్లు బహుమతిగా ఇస్తామని ప్రకటించి, బరుల వద్ద వాటిని ప్రదర్శనకు ఉంచారు. ఒక శిబిరంలో ఆరు పుంజుల పోటీలో నెగ్గిన వారికి, మరోచోట ఇద్దరు విజేతలకు బైక్లు అందజేస్తామన్నారు. పందెం రాయుళ్లను ఆకర్షించేందుకు నిర్వాహకులు ఇలాంటి భారీ ఆఫర్లు ప్రకటించడం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.


