News December 4, 2024

కడప జిల్లాలో 829 మంది ప్రధానోపాధ్యాయులకు నోటీసులు

image

కడప జిల్లాలో పెద్ద ఎత్తున ప్రధానోపాధ్యాయులకు విద్యాశాఖ అధికారి షోకాజ్ నోటీసులు ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది. పాఠశాలల్లో పిల్లల అపార్ నమోదు పూర్తి చేయలేదని 829 మంది ప్రధానోపాధ్యాయులకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. మూడు రోజుల్లో వివరణ ఇవ్వకపోతే ప్రధానోపాధ్యాయులపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని జిల్లా విద్యాశాఖ అధికారి నోటీసుల్లో పేర్కొన్నారు. దీంతో ప్రధానోపాధ్యాయులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Similar News

News March 10, 2026

కడప: MSPతో 10,059 క్వింటాళ్లు కొనుగోలు

image

కడప జిల్లాలో సోమవారం నాటికి రైతుల నుంచి కనీస మద్దతు ధర(MSP)తో 10,059 క్వింటాళ్ల పంటను మార్క్ ఫెడ్ ద్వారా కొనుగోలు చేశారు. సుమారు 2,021 మంది రైతుల నుంచి 8,210 క్వింటాళ్ల శనగలు, 50 మంది రైతుల నుంచి 1,819 క్వింటాళ్ల కందులు, 1 రైతు నుంచి 30 క్వింటాళ్ల పెసలు కొనుగోలు చేశారు. జిల్లాలో 21 ప్రొక్యూర్ మెంట్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. హ్యాండ్లింగ్, క్లీనింగ్ పేరుతో క్వింటాలుకు రూ.200లు రాబడుతున్నారు.

News March 9, 2026

కడప: శనగ కొనుగోలు కేంద్రాల్లో అదనపు వసూళ్లపై జేసీ ఆగ్రహం.!

image

కడప జిల్లాలో శనగ కొనుగోలు కేంద్రాల్లో రైతుల నుంచి అదనపు వసూళ్లు చేస్తుండడంపై వస్తున్న పిర్యాదులపై జేసీ నిధిమీనా ఆగ్రహం వ్యక్తం చేశారు. శనగ కొనుగోలు కేంద్రాల్లోని పరిస్థితులపై సోమవారం సాయంత్రం కడపలో సంబంధిత అధికారులతో జేసీ సమావేశం నిర్వహించారు. హ్యాండ్లింగ్, క్లీనింగ్ పేరుతో అదనపు వసూళ్లపై ఆరా తీశారు. కలెక్టర్ వద్దకు తీసుకెళ్లాలని నిర్ణయించారు. మార్క్ ఫెడ్ DM, DCMS BM, DCO పాల్గొన్నారు.

News March 9, 2026

కడపలో కేవలం ఆయన వర్గం టీడీపీలోకి వెళ్తోందా?

image

కడపలో ఇటీవల YCP నుంచి TDPలోకి కార్పొరేటర్లు చేరుతున్నారు. ఇందులో సింహభాగం మాజీ మేయర్ సురేశ్ బాబు వర్గమే TDP కండువా కప్పుకున్నట్లు తెలుస్తోంది. మొదటగా ఆయన ప్రధాన అనుచరుడిగా పేరున్న సూర్యనారాయణ TDPలో చేరారు. ఆ తర్వాత దాదాపు 8 మంది కార్పొరేటర్లు YCPకి గుడ్ బై చెప్పారు. తాజాగా మరో నలుగురు చేరారు. మేయర్ సీటు కోల్పోవడంతో ఆయనే TDPలోకి పంపిస్తున్నారంటూ YCPలోని మరో వర్గం గుసగుసలాడుతున్నాయి.