News December 4, 2024
KCR, ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు

TG: BRS కార్యాలయాలకు భూకేటాయింపులపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ దాఖలైన పిటిషన్లపై హైకోర్టులో విచారణ జరిగింది. తక్కువ ధరకు భూముల అమ్మకాలు జరిగాయని, రూ.500 కోట్ల విలువైన భూమిని రూ.5కోట్లకు కేటాయించారని పిటిషనర్ కోర్టులో వాదించారు. దీనిపై మూడు వారాల్లోగా కౌంటర్ దాఖలు చేయాలని BRS అధ్యక్షుడు KCR సహా రాష్ట్ర ప్రభుత్వానికి న్యాయస్థానం నోటీసులు పంపింది.
Similar News
News September 15, 2025
పాడి పశువుల్లో పాలజ్వరం – లక్షణాలు

ఈ వ్యాధి అధిక పాలిచ్చే ఆవులు, గేదెల్లో ఎక్కువగా వస్తుంది. వ్యాధి సోకిన పశువులు సరిగా మేత మేయకపోవడం, నెమరు వేయకపోవడం, బెదురు చూపులతో చికాకుగా ఉండి, వణుకుతూ కదలలేని స్థితిలో ఉంటాయి. సరిగా నిలబడలేవు. పశువులు తమ తలను పొట్టకు ఆనించి.. S ఆకారంలో మగతగా పడుకొని ఉండటం పాల జ్వరంలో కనిపించే ప్రత్యేక లక్షణం. వ్యాధి తీవ్రమైతే శ్వాస, నాడి వేగం పూర్తిగా పడిపోయి పశువులు మరణించే అవకాశం ఉంది.
News September 15, 2025
పాడిపశువుల్లో పాలజ్వరం నివారణకు సూచనలు

పాలిచ్చే పశువులు చూడి దశలో ఉన్నప్పుడే దాణాలో సరిపడా కాల్షియం ఉండేలా చూసుకోవాలి. లెగ్యూమ్ జాతి పశుగ్రాసాలు, పచ్చిమేతలో కాల్షియం ఎక్కువగా ఉంటుంది. మేతలో తులసి, అవిసె, మల్బరీ, సుబాబుల్, మునగ వంటి ఆకుల్ని కలపడం వల్ల చాలావరకు పోషకాహార లోపాలను నివారించవచ్చు. పశువులు ఈనే 5 రోజుల ముందు నుంచి విటమిన్-డి ఇంజెక్షన్లు, ఈనిన వెంటనే కాల్షియంతో కూడిన ఇంజెక్షన్లు వెటర్నరీ నిపుణుల సూచనతో ఇవ్వాలి.
News September 15, 2025
కేంద్రానికి రూ.100 చెల్లిస్తే మనకి ఎంత తిరిగి వస్తుందంటే?

రాష్ట్రాలు పన్ను రూపంలో కేంద్రానికి చెల్లించే ప్రతి రూ.100లో తిరిగి ఎంత పొందుతాయో తెలుసా? అత్యల్పంగా మహారాష్ట్ర రూ.100 పన్నులో ₹6.8 మాత్రమే తిరిగి పొందుతోంది. అత్యధికంగా అరుణాచల్ ప్రదేశ్ ₹4278.8 తీసుకుంటుంది. ఆర్థిక సంఘం సూత్రాల ఆధారంగా జనాభా, ఆదాయ అసమానత వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని పంపిణీ చేస్తారు. TGకి ₹43.9, APకి ₹40.5 వస్తాయి. వెనుకబడిన రాష్ట్రాల అభివృద్ధికి తోడ్పడటమే దీని ఉద్దేశ్యం.