News December 4, 2024

ఒకే ప్రాంతంలో మూడేళ్లుగా భూకంపం!

image

తెలంగాణలోని ములుగులో 5.3 తీవ్రతతో భూకంపం సంభవించిన విషయం తెలిసిందే. అయితే, రాష్ట్రంలో గత మూడేళ్లుగా సంభవించిన భూకంపాల్లో ప్రతి ఏటా ఒకే ప్రాంతంలో ములుగు చుట్టు పక్కన భూమి కంపించడాన్ని గుర్తించినట్లు నిపుణులు పేర్కొన్నారు. అక్కడ ఈసారి కాస్త బలంగా వచ్చినట్లు వెల్లడించారు. గడ్చిరోలి సమీపంలో 2021లో 4.0, 2022లో 3.8, 2023లో భద్రాద్రిలో 3.6 తీవ్రతతో భూకంపాలు వచ్చాయన్నారు.

Similar News

News March 23, 2026

‘ధురంధర్-2’: 4 రోజుల్లోనే రూ.761కోట్లు

image

రణ్‌వీర్ సింగ్ హీరోగా ఆదిత్య ధర్ డైరెక్షన్‌లో వచ్చిన ‘ధురంధర్- 2’ కలెక్షన్లతో రికార్డులు సృష్టిస్తోంది. ఈ చిత్రం రిలీజైన నాలుగు రోజుల్లోనే రూ.761కోట్లు(గ్రాస్) సాధించినట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఇందులో ఇండియాలోనే రూ.550కోట్లు రావడం విశేషం. తొలి 2,3 రోజులతో పోల్చితే నాలుగో రోజు(ఆదివారం) భారీగా కలెక్షన్లు వచ్చినట్లు తెలిపారు. ఈ వీకెండ్‌లోపు రూ.వెయ్యి కోట్ల క్లబ్‌లోకి చేరే అవకాశం ఉంది.

News March 23, 2026

విపక్షాల ట్రాప్‌లో పడొద్దు: రేవంత్

image

TG: మూసీ నిర్వాసితులకు అన్యాయం చేయబోమని సీఎం రేవంత్ అసెంబ్లీలో పునరుద్ఘాటించారు. వారికి మెరుగైన వసతులతో పునరావాసం కల్పిస్తామని, విద్య, వైద్యం అందిస్తామని హామీ ఇచ్చారు. మహిళలు వ్యాపారాలు చేసుకోవడానికి సహకరిస్తామన్నారు. విపక్షాల ట్రాప్‌లో పడొద్దని వారికి సూచించారు.

News March 23, 2026

మూసీ ప్రక్షాళనపై సలహాలు స్వీకరిస్తాం: సీఎం రేవంత్

image

TG: మూసీ ప్రక్షాళన అత్యవసరమని సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో స్పష్టం చేశారు. రాజకీయాలకు అతీతంగా అందరూ కలిసి రావాలని పిలుపునిచ్చారు. ‘గుజరాత్‌లో సబర్మతి ప్రక్షాళనకు కాంగ్రెస్ సహకరించింది. HYDలో మూసీ అభివృద్ధికి రాజకీయ రంగు ఎందుకు? అడ్డుకోవడం తప్పించి ఏ సలహా ఇచ్చినా తీసుకుంటాం. నాకు చెప్పడానికి ఇబ్బందైతే మంత్రులతో కమిటీ వేస్తా. వాళ్లకైనా మీ అభిప్రాయాలు చెప్పండి’ అని సూచించారు.