News December 4, 2024
‘స్థిరమైన వృద్ధిరేటు సాధనకు కృషి చేద్దాం’

శ్రీ సత్యసాయి జిల్లాలో బ్యాంకర్ల భాగస్వామ్యంతో స్థిరమైన వృద్ధిరేటు సాధనకు కృషి చేద్దామని శ్రీ సత్యసాయి జిల్లా కలెక్టర్ టీఎస్ చేతన్ పేర్కొన్నారు. బుధవారం కలెక్టరేట్లో లక్ష్యసాధన ప్రగతిపై బ్యాంకర్లు, వివిధ ప్రభుత్వ శాఖల అధికారులతో జిల్లా స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. అన్ని శాఖల అధికారులు భాగస్వాములతో సమన్వయం చేసుకొని అర్హత కలిగిన వారికి రుణాలు మంజూరు చేయాలని కలెక్టర్ ఆదేశించారు.
Similar News
News April 3, 2026
నార్పలలో మత్తుమందు చల్లి దొంగతనం

నార్పలలో పట్టపగలే దొంగలు రెచ్చిపోయారు. గూగూడు రోడ్డులో ఉన్న మల్లికార్జున డ్రిప్పుల దుకాణంలో గుర్తుతెలియని వ్యక్తి రూ.500కు చిల్లర కావాలని అడిగి యజమానిపై మత్తుమందు చెల్లి రూ.45 వేలు దోచుకెళ్లాడు. షాప్ యజమాని ఫిర్యాదు మేరకు ఎస్ఐ సాగర్ షాపులో ఉన్న సీసీ కెమెరాలను పరిశీలించారు. త్వరలోనే దొంగను అదుపులోకి తీసుకొని బాధితుడికి న్యాయం చేస్తామని ఎస్ఐ తెలిపారు.
News April 3, 2026
పంచాయతీలకు ప్రత్యేక అధికారుల పాలన

అనంతపురం జిల్లాలోని గ్రామ పంచాయతీలలో సర్పంచుల పదవీకాలం ముగియడంతో నేటి నుంచి ప్రత్యేక అధికారుల పాలన ప్రారంభం కానుంది. మొత్తం 575 పంచాయతీలు ఉండగా, గతంలోనే ఎన్నికలు జరగని ఏ.నారాయణపురం, పామిడిలకు పాత అధికారులే కొనసాగుతారని కలెక్టర్ ఆనంద్ తెలిపారు. ప్రత్యేక అధికారుల జాబితాకు ఆయన ఆమోదముద్ర వేశారు. మండలాల్లో ఒక్కో అధికారికి రెండు నుంచి ఆరు పంచాయతీల బాధ్యతలను అప్పగించినట్లు కలెక్టర్ వెల్లడించారు.
News April 2, 2026
ప్రకృతి వ్యవసాయం వైపు రైతులు అడుగులు వేయాలి: కలెక్టర్

ప్రకృతి వ్యవసాయం వైపు రైతులు అడుగులు వేయాలని కలెక్టర్ ఆనంద్ పిలుపునిచ్చారు. అనంతపురంలోని DPMU కార్యాలయంలో నిర్వహించిన జిల్లాస్థాయి ప్రకృతి వ్యవసాయ టీవోటీ శిక్షణ కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొన్నారు. పీడీఎంఎస్ను జిల్లాలో ముందుకు తీసుకువెళ్లాలన్నారు. ప్రకృతి వ్యవసాయంలో వినూత్న మోడల్స్ జిల్లా ద్వారా మన దేశంతో పాటు ప్రపంచ దేశాలకు ఆదర్శం అవ్వడం గర్వకారణం అని అన్నారు.


