News December 4, 2024
మత్స్యకారుల సంక్షేమానికి తీసుకుంటున్న చర్యలేంటి: ఎంపీ వేమిరెడ్డి

దేశంలో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మత్స్యకారుల సంక్షేమానికి కేంద్రం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో వివరించాలని నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్రెడ్డి బుధవారం కోరారు. లోక్సభలో ఆయన మత్స్యకారుల సంక్షేమానికి సంబంధించి పలు ప్రశ్నలు వేశారు. ఆంధ్రప్రదేశ్లో మత్స్యకారుల నైపుణ్యాభివృద్ధికి, శిక్షణ అందించడానికి ప్రభుత్వం ఏదైనా పథకాలను అమలు చేస్తుందా అని ప్రశ్నించారు.
Similar News
News March 7, 2026
నెల్లూరు: బాలికకు మాయమాటలు చెప్పి..

VK పాడు(M)కు చెందిన యువకుడిపై పోక్సో కేసు నమోదు చేసినట్లు SI రఘునాథ్ తెలిపారు. మండలంలోని ఓ గ్రామానికి చెందిన బాలికకు లవ్ చేస్తున్నానని చెప్పి యువకుడు తీసుకెళ్లిన ఘటనపై పేరెంట్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు నిన్న ఆ యువకుడిని అదుపులోకి తీసుకొని ఉదయగిరి కోర్టులో హాజరుపర్చగా 14 రోజుల పాటు రిమాండ్ విధించారు. బాలికను పేరెంట్స్కు అప్పగించారు.
News March 7, 2026
నెల్లూరు మున్సిపల్ అధికారులు వార్నింగ్

నెల్లూరు నగరంలో రూ.44 కోట్ల పన్ను బకాయిలు పేరుకుపోవడంతో మున్సిపల్ అధికారులు సీరియస్ అయ్యారు. మార్చి 31 డెడ్ లైన్ కావడంతో, సుమారు 14,300 మంది మొండి బకాయిదారులకు లోక్ అదాలత్ నోటీసులు జారీ చేస్తున్నారు. గత ఏడాదిలా 50% రాయితీ వస్తుందని ఆశించి పన్ను ఆపేయవద్దని, అలా చేస్తే ఇంటి నల్లా కనెక్షన్లు తొలగిస్తామని హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా భారీ బకాయిలు ఉన్న హోటళ్లు, మాల్స్, ఇండస్ట్రీలపై నిఘా పెట్టారు.
News March 7, 2026
నెల్లూరు: రియల్ ఎస్టేట్ వ్యాపారి ఇంట్లో రూ.16 లక్షల నగదు చోరీ

కొండాయపాలెం నందనవనానికి చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి శ్రీధర్ రెడ్డి బీరువాలో ఉన్న రూ. 16.50 లక్షల నగదు, 55 గ్రాముల బంగారు చోరీకి గురైందని వేదాయపాలెం పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన అసిస్టెంట్ శ్రీనివాసులు అనే వ్యక్తికి నగదుబీరువాలో ఉంచమని ఇచ్చారు. అనంతరం నిద్రపోయే లేచి చూడగా బీరువాలో నగదు, బంగారు, పార్కింగ్లో ఉన్న బైక్ కనపడలేదని అన్నారు. తన అసిస్టెంట్పై అనుమానం ఉందని ఫిర్యాదు చేశారు.


