News December 14, 2024
బాంబు బెదిరింపులకు పాల్పడింది 12 ఏళ్ల బాలుడు?

దేశ రాజధాని ఢిల్లీలోని పలు స్కూళ్లకు వరుస బాంబు బెదిరింపులు వచ్చిన విషయం తెలిసిందే. కాగా ఈ బెదిరింపులకు పాల్పడింది 12 ఏళ్ల బాలుడని పోలీసులు గుర్తించినట్లు తెలుస్తోంది. అతడితో పాటు తల్లిదండ్రులకు కూడా పోలీసులు కౌన్సెలింగ్ ఇచ్చి పంపినట్లు సమాచారం. గతంలో బాంబు బెదిరింపులకు పాల్పడిన వారిని పట్టుకోలేదనే కోపంతోనే ఆ విద్యార్థి ఈ పని చేసినట్లు తెలుస్తోంది.
Similar News
News February 2, 2026
జార్జియాలో ‘వారణాసి’ షూటింగ్!

రాజమౌళి దర్శకత్వంలో మహేష్బాబు, ప్రియాంకా చోప్రా జంటగా రూపొందుతున్న చిత్రం ‘వారణాసి’. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ హైదరాబాద్లో జరుగుతోంది. ఈ సినిమా తర్వాతి షెడ్యూల్ జార్జియాలో మొదలుకానున్నట్లు తెలుస్తోంది. డెరెక్టర్ రాజమౌళి దీనికి సంబంధించి ఆల్రెడీ వర్క్ స్టార్ట్ చేశారట. అలాగే మరో కీలక షెడ్యూల్ను అంటార్కిటికాలో చిత్రీకరిస్తారని ప్రచారం జరుగుతోంది. ఈ సినిమా 2027 ఏప్రిల్ 7న రిలీజ్ కానుంది.
News February 2, 2026
పెసరపిండి దీపం ఎందుకు వెలిగించాలంటే..?

ఇంట్లో దారిద్ర్యం తొలగి, లక్ష్మీదేవి కటాక్షం కలగాలంటే పెసరపిండి దీపం వెలిగించాలి. ఆర్థిక ఇబ్బందులతో సతమతమయ్యే వారు ఈ దీపారాధన చేయడం వల్ల సుఖశాంతులు చేకూరుతాయి. పెసరపిండి దీపం బుధ గ్రహానికి ప్రీతికరమైనది, కాబట్టి ఇది వ్యాపార అభివృద్ధికి కూడా తోడ్పడుతుంది. నిత్యం పేదరికం వేధిస్తున్నా, సంపాదన నిలకడగా లేకపోయినా ఈ దీపాన్ని వెలిగిస్తే అద్భుతమైన మార్పులు కనిపిస్తాయని పండితులు చెబుతున్నారు.
News February 2, 2026
రష్యా దాడిలో 15 మంది ఉక్రెయిన్ పౌరులు మృతి

ఉక్రెయిన్పై రష్యా దాడులు కొనసాగుతున్నాయి. తాజాగా నిప్రో నగరంపై జరిపిన డ్రోన్ అటాక్లో 15 మంది మరణించారు. నిప్రోపెట్రోవ్స్క్ ప్రాంతంలోని DTEK విద్యుత్ ఉత్పత్తి సంస్థ గనులపై రష్యా దాడులకు పాల్పడింది. షిఫ్ట్ ముగించుకొని బస్సులో ఇంటికి బయల్దేరిన కార్మికులు ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయినట్లు ఆ సంస్థ పేర్కొంది. మరోవైపు అబుదాబీ వేదికగా FEB 4,5 తేదీల్లో అమెరికా, రష్యా, ఉక్రెయిన్ మధ్య చర్చలు జరగనున్నాయి.


