News September 24, 2024
మోదీలాంటి నాయకుడుంటే ‘$7ట్రిలియన్ల ఎకానమీ’ సాధ్యమే: JP మోర్గాన్

‘$7ట్రిలియన్ల ఎకానమీ’ని భారత్ సాధించగలదని JP మోర్గాన్ CEO జేమీ డిమాన్ అన్నారు. ఇందుకు PM మోదీలాంటి బలమైన నాయకత్వం అవసరమన్నారు. ‘ఆధార్, బ్యాంకింగ్ A/Cs, GST రిఫార్మ్స్, ఇన్ఫ్రా బిల్డింగ్, నియంత్రణల తగ్గింపు సంపన్నులకే కాకుండా దేశం, తక్కువ ఆదాయ వర్గాలకూ సాయపడ్డాయి. గతంతో పోలిస్తే దేశం మరింత డెవలప్ అయింది. మేమిక్కడి నుంచే ఎందరో క్లైంట్లకు సేవలందిస్తున్నాం. మాకు 55వేల ఉద్యోగులున్నారు’ అని చెప్పారు.
Similar News
News December 9, 2025
ఫ్రాడ్ కాల్స్ వేధిస్తున్నాయా?

ప్రస్తుతం చాలా మందిని ఫ్రాడ్ కాల్స్, మెసేజ్లు వేధిస్తున్నాయి. అయితే వాటిపై మనం ఫిర్యాదు చేసే అవకాశం ఉంది. సంచార్ సాథీ (<
News December 9, 2025
నువ్వుల విత్తనాలను వెదజల్లేకంటే విత్తడం మేలట

నువ్వుల పంట కోసం విత్తనాలను సాధారణంగా రైతులు వెదజల్లుతారు. అయితే విత్తనాన్ని వెదజల్లడం కంటే విత్తడం మేలంటున్నారు నిపుణులు. విత్తనాలను వరుసల మధ్య 30సెం.మీ, మొక్కల మధ్య 15సెం.మీ దూరం ఉండేటట్లు విత్తుకోవాలంటున్నారు నిపుణులు. విత్తనాలను వరుసలలో విత్తితే కలుపు తీసుకోవడానికి అనువుగా ఉండటమే కాకుండా మొక్కకు నీరు, పోషకాలు, సూర్యరశ్మి సమానంగా అంది కొమ్మలు బాగా వృద్ధి చెంది అధిక దిగుబడులు సాధించవచ్చు.
News December 9, 2025
మహాలక్ష్మి పథకంతో మహిళలకు రూ.8,459 కోట్లు ఆదా: పొన్నం

TG: మహాలక్ష్మి పథకం ద్వారా RTCలో మహిళలకు ఉచిత ప్రయాణాలు మొదలై రెండేళ్లు పూర్తయ్యాయని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ఈ సందర్భంగా ఉద్యోగులు, సిబ్బందికి శుభాకాంక్షలు తెలియజేశారు. రెండేళ్లలో మహిళలు 251 కోట్ల జీరో టికెట్ల ద్వారా రూ.8,459 కోట్లు ఆదా చేసినట్లు వెల్లడించారు. బస్సుల్లో ఉచిత ప్రయాణమే కాకుండా మహిళలను బస్సులకు యజమానులుగా చేసిన ప్రభుత్వంగా నిలిచిందని పేర్కొన్నారు.


