News September 3, 2024
72 ఏళ్ల బామ్మ అకౌంట్ నుంచి రూ.72 లక్షలు కాజేశారు
RBI, CBI పేర్లు చెప్పి ఆర్థిక మోసాలు పెరిగిపోతున్నాయి. ఇలాంటి మోసానికి గురై కేరళకు చెందిన 72 ఏళ్ల బామ్మ రూ.72 లక్షలు మోసపోయింది. RBI నుంచి ఫోన్ చేస్తున్నామని పరిచయం చేసుకొని క్రెడిట్ కార్డ్ బ్లాక్ అయిందని ఒకరు, సీబీఐ అని చెప్పి మనీలాండరింగ్ కేసు నమోదైందంటూ మరొకరు ఫోన్ చేసి ఆమెను భయపెట్టారు. ఈ క్రమంలో బామ్మ బ్యాంక్ వివరాలు సేకరించిన కేటుగాళ్లు ఆమె అకౌంట్లోని రూ.72 లక్షలు కాజేశారు.
Similar News
News September 15, 2024
SHOCKING: అఫ్గానిస్థాన్లో క్రికెట్ నిషేధం?
అఫ్గానిస్థాన్లో క్రికెట్ను క్రమంగా నిషేధించాలని ఆ దేశ సర్కారు భావిస్తున్నట్లు సమాచారం. షరియా చట్టానికి క్రికెట్ హాని కలిగిస్తోందని తాలిబన్ సుప్రీం లీడర్ హిబతుల్లా భావిస్తున్నట్లు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. షరియాను మరింత కఠినంగా అమలు చేయాలని ఆయన నిర్ణయించినట్లు తెలుస్తోంది. దీనిపై అధికారికంగా ప్రకటన రావాల్సి ఉంది. బలమైన జట్టుగా ఎదుగుతున్న అఫ్గాన్కు ఇది శరాఘాతమని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.
News September 15, 2024
ఆ గ్రహశకలం వచ్చేది నేడే!
ఓ గ్రహశకలం భూమికి అతి సమీపంగా దూసుకెళ్లనుందని నాసా చాలారోజుల క్రితమే హెచ్చరించిన సంగతి తెలిసిందే. ఆ శకలం దూసుకెళ్లేది నేడే. 720 అడుగుల చుట్టుకొలత కలిగిన ఆస్టరాయిడ్ పెను వేగంతో భూమికి 6.20 లక్షల మైళ్ల దూరం నుంచి ప్రయాణించనుంది. అది భూమిని ఢీకొడుతుందని, యుగాంతమేనని గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో పోస్టులు వైరల్ అవుతున్నాయి. అయితే, దాని వల్ల భూమికి ముప్పు లేనట్లేనని నాసా క్లారిటీ ఇచ్చింది.
News September 15, 2024
జగన్పై ద్వేషంతో చంద్రబాబు ఇలా చేయడం అన్యాయం: రోజా
AP: జగన్పై ఉన్న ఈర్ష్య, ద్వేషంతో సీఎం చంద్రబాబు విద్యార్థుల భవిష్యత్తును నాశనం చేయాలనుకోవడం అన్యాయమని మాజీ మంత్రి రోజా ట్వీట్ చేశారు. ‘గత ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త మెడికల్ కాలేజీలను ప్రైవేటు పరం చేయాలని CM చంద్రబాబు నిర్ణయించారు. పులివెందుల కాలేజీకి కేటాయించిన సీట్లను రద్దు చేయాలని NMCకి లేఖ రాయడం దుర్మార్గం. YCP పాలనలో నిర్మించిన కాలేజీలన్నింటినీ ప్రభుత్వమే నిర్వహించాలి’ అని డిమాండ్ చేశారు.