News April 17, 2024
కోర్టులో బెంచ్ క్లర్క్.. ఇప్పుడు సివిల్స్ ర్యాంకర్!

సివిల్స్-2023 ఫలితాల్లో మొదటి 100 ర్యాంకులు సాధించిన వారిని నెటిజన్లు అభినందనలతో ముంచెత్తుతున్నారు. అయితే, మొదటి ర్యాంకు కాకుండా చివరి ర్యాంకు వచ్చిన అభ్యర్థి గురించి నెట్టింట చర్చ జరుగుతోంది. బిహార్లోని షేక్పురా జిల్లా కోర్టులో బెంచ్ క్లర్క్గా పనిచేసే మహేశ్ కుమార్.. UPSC ఫలితాల్లో 1016వ ర్యాంకును సాధించారు. ఆశయ సాధనకు వయసుతో సంబంధం లేదని, బలమైన సంకల్పం ఉంటే చాలని ఆయన్ను అభినందిస్తున్నారు.
Similar News
News December 4, 2025
తన కన్నా అందంగా ఉండొద్దని.. మేనత్త దారుణం!

కుటుంబంలో తన కన్నా అందంగా ఎవ్వరూ ఉండొద్దని దారుణాలకు పాల్పడిందో మహిళ. ముగ్గురు కోడళ్లు, కొడుకును నీళ్లలో ముంచి హత్య చేసింది. పానిపట్(హరియాణా)లో పెళ్లివేడుకలో విధి(6) టబ్లో పడి చనిపోయింది. పోలీసుల దర్యాప్తులో మేనత్త పూనమ్ హత్య చేసిందని తేలింది. మరో 3హత్యలూ చేసినట్లు పూనమ్ ఒప్పుకుంది. 2023లో ఇషిక(9)ను చంపిన ఆమె తనపై అనుమానం రాకుండా కొడుకు శుభం(3)ను చంపేసింది. ఆగస్టులో జియా(6)ను పొట్టనపెట్టుకుంది.
News December 4, 2025
ఫిబ్రవరిలో పెళ్లి అని ప్రచారం.. స్పందించిన రష్మిక

నటి రష్మిక మందన్న-విజయ్ దేవరకొండ పెళ్లి వార్తలు కొంతకాలంగా వైరల్ అవుతూనే ఉన్నాయి. 2026 ఫిబ్రవరిలో రాజస్థాన్లో పెళ్లి జరుగుతుందనే ప్రచారం జరుగుతోంది. దీనిపై రష్మిక తాజాగా ఓ ఇంటర్వ్యూలో స్పందిస్తూ.. ‘వివాహాన్ని నేను ధ్రువీకరించను. అలాగని ఖండించను. సమయం వచ్చినప్పుడు మాట్లాడతా. అంతకుమించి ఏమీ చెప్పను’ అని ప్రశాంతంగా సమాధానం ఇచ్చారు.
News December 4, 2025
APPLY NOW: BEMLలో ఉద్యోగాలు

భారత్ ఎర్త్ మూవర్స్ లిమిటెడ్(<


