News April 17, 2024
కోర్టులో బెంచ్ క్లర్క్.. ఇప్పుడు సివిల్స్ ర్యాంకర్!

సివిల్స్-2023 ఫలితాల్లో మొదటి 100 ర్యాంకులు సాధించిన వారిని నెటిజన్లు అభినందనలతో ముంచెత్తుతున్నారు. అయితే, మొదటి ర్యాంకు కాకుండా చివరి ర్యాంకు వచ్చిన అభ్యర్థి గురించి నెట్టింట చర్చ జరుగుతోంది. బిహార్లోని షేక్పురా జిల్లా కోర్టులో బెంచ్ క్లర్క్గా పనిచేసే మహేశ్ కుమార్.. UPSC ఫలితాల్లో 1016వ ర్యాంకును సాధించారు. ఆశయ సాధనకు వయసుతో సంబంధం లేదని, బలమైన సంకల్పం ఉంటే చాలని ఆయన్ను అభినందిస్తున్నారు.
Similar News
News December 5, 2025
763 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల

DRDO ఆధ్వర్యంలోని సెంటర్ ఫర్ పర్సనల్ టాలెంట్ మేనేజ్మెంట్( CEPTAM) 763 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది. వీటిలో సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్-B పోస్టులు 561, టెక్నీషియన్-A పోస్టులు 203 ఉన్నాయి. అభ్యర్థుల వయసు 18 – 28 ఏళ్ల మధ్య ఉండాలి. డిసెంబర్ 9 నుంచి దరఖాస్తులు స్వీకరించనున్నారు. వెబ్సైట్: https://www.drdo.gov.in *మరిన్ని ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం కోసం<<-se_10012>> జాబ్స్ <<>>కేటగిరీకి వెళ్లండి.
News December 5, 2025
విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్లో ఉద్యోగాలు.. అప్లై చేశారా?

ఇస్రో-<
News December 5, 2025
ఇలాంటి మొక్కజొన్న గింజలకు మంచి ధర

మొక్కజొన్నను నూర్పిడి చేసిన తర్వాత మార్కెట్లో మంచి ధర రావాలంటే తప్పనిసరిగా కొన్ని నాణ్యతా ప్రమాణాలను పాటించాల్సి ఉంటుంది. నూర్పిడి చేసిన గింజల్లో దుమ్ము, చెత్త, రాళ్లు, మట్టి పెళ్లలు 1 శాతం మించరాదు. గింజల్లో తేమ 14 శాతం కంటే ఎక్కువ ఉండకూడదు. విరిగిన విత్తనాలు 2 శాతానికి మించరాదు. పాడైపోయిన విత్తనాలు 6 శాతం లోపు ఉండాలి. ఇతర రంగు మొక్కజొన్న గింజలు 6 శాతం మించకుండా ఉండాలి.


