News April 4, 2024
ఆర్థికవ్యవస్థకు వడదెబ్బ!

ఏటా వేసవికి పెరుగుతున్న ఉష్ణోగ్రతలు దేశ ఆర్థికవ్యవస్థపై ప్రభావం చూపించొచ్చంటున్నారు నిపుణులు. ‘ఈసారి 10-20రోజుల పాటు అధిక ఉష్ణోగ్రతలు రికార్డ్ కానున్న నేపథ్యంలో విద్యుత్, ఆహారం, వ్యాపారం, వడ్డీరేట్లు, GDP వృద్ధిపై ప్రభావం చూపొచ్చు. అధిక ఉష్ణోగ్రతలు పంట దిగుబడిని దెబ్బతీస్తే ఆ ప్రభావం వడ్డీరేట్లపైనా ఉంటుంది. విద్యుత్ కొరత, పరిశ్రమల ఉత్పాదకత తగ్గడం వంటి సవాళ్లు ఎదురవుతాయి’ అని హెచ్చరిస్తున్నారు.
Similar News
News April 22, 2025
BREAKING: ఫలితాలు ఆలస్యం

తెలంగాణ ఇంటర్ ఫలితాలు కాసేపట్లో విడుదల కానున్నాయి. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మధ్యాహ్నం గం.12కు రిజల్ట్స్ ప్రకటించాల్సి ఉంది. కానీ ఇప్పటికే షెడ్యూల్ అయిన కార్యక్రమాల వల్ల ఆయన ఇంకా ఇంటర్ బోర్డుకు చేరుకోలేదు. కాసేపట్లో భట్టి వస్తారని తెలుస్తోంది.
Stay Tuned..
News April 22, 2025
అరెస్టుల్లో వేగం పెంచిన కూటమి ప్రభుత్వం

AP: అరెస్టుల వ్యవహారంలో కూటమి ప్రభుత్వం స్పీడ్ పెంచింది. తాజాగా సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్ PSR ఆంజనేయులును అరెస్టు చేసింది. గత ప్రభుత్వంలో ఈయన ఇంటెలిజెన్స్ చీఫ్గా పని చేశారు. ముంబై నటి జెత్వానీ వేధింపుల కేసులో ఆంజనేయులుపై పలు అభియోగాలు ఉన్నాయి. మరోవైపు మద్యం కేసులో రాజ్ కసిరెడ్డిని సిట్ పోలీసులు నిన్న అరెస్టు చేశారు. ఇక డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబుపై కేసు రీఓపెన్ చేశారు.
News April 22, 2025
ఒకేసారి ఆరుగురు పిల్లలకు పెళ్లి చేశారు!

పిల్లల పెళ్లి విషయంలో సమయాన్ని, డబ్బును ఆదా చేసేందుకు ఇద్దరు అన్నదమ్ములు వినూత్నంగా ఆలోచించారు. తమకున్న ఆరుగురు పిల్లలకు ఒకేసారి పెళ్లి చేసి అందరి దృష్టినీ ఆకర్షించారు. ఈ ఘటన హరియాణాలోని హిసార్ జిల్లా గవాద్ గ్రామంలో జరిగింది. ఇద్దరు కుమారులది ఈనెల 18న, నలుగురు కుమార్తెల వివాహం 19న చేశారు. సామాన్యులంతా ఇలాగే చేసి సమాజానికి మంచి సందేశం ఇవ్వాలని ఆ ఊరి వారంటున్నారు.