News November 30, 2024

నేడు స్కూళ్ల బంద్‌కు పిలుపు

image

TG: నేడు రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల బంద్‌కు SFI, AISF, PDSU లాంటి వామపక్ష విద్యార్థి సంఘాలు పిలుపునిచ్చాయి. ప్రభుత్వ స్కూళ్లు, హాస్టళ్లలో నాణ్యతలేని ఆహారం కారణంగా ఫుడ్ పాయిజనింగ్ ఘటనలు వెలుగుచూస్తున్నా, ప్రభుత్వం పట్టించుకోవట్లేదని ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఈ క్లిష్టమైన సమస్యలను హైలైట్ చేయడమే ఈ బంద్ లక్ష్యమని తెలిపాయి. వెంటనే విద్యాశాఖకు మంత్రిని నియమించాలని డిమాండ్ చేశాయి.

Similar News

News December 1, 2025

పెద్దపల్లి: ఎయిడ్స్ దినోత్సవం సందర్భంగా అవగాహన ర్యాలీ

image

పెద్దపల్లి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి నుంచి సిరి ఫంక్షన్ హాల్ వరకు ఎయిడ్స్ దినోత్సవం సందర్భంగా సోమవారం అవగాహన ర్యాలీ నిర్వహించారు. జిల్లా వైద్యాధికారి డా.వి.వాణిశ్రీ జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. అనంతరం జరిగిన సమావేశంలో డ్రగ్స్ వినియోగం, అసురక్షిత లైంగిక చర్యలు, వాడిన సిరంజిల వల్ల ఎచ్‌.ఐ.వి. వ్యాప్తి ప్రమాదం పెరుగుతోందని ఆమె చెప్పారు. యువతలో అవగాహన పెంపు అత్యవసరమని సూచించారు.

News December 1, 2025

ఇతిహాసాలు క్విజ్ – 83 సమాధానాలు

image

నేటి ప్రశ్న: శివారాధనకు సోమవారాన్ని ప్రత్యేకంగా భావిస్తారు. అందుకు కారణమేంటి?
సమాధానం: సోమవారానికి సోముడు అధిపతి. సోముడంటే చంద్రుడే. ఆ చంద్రుడిని శివుడు తన తలపై ధరిస్తాడు. అలా సోమవారం శివుడికి ప్రీతిపాత్రమైనదిగా మారింది. జ్యోతిషం ప్రకారం.. సోమవారం రోజున శివుడిని పూజిస్తే చంద్రుడి ద్వారా కలిగే దోషాలు తొలగి, మానసిక ప్రశాంతత, అదృష్టం లభిస్తాయని నమ్మకం.
<<-se>>#Ithihasaluquiz<<>>

News December 1, 2025

వ్యవసాయం కుదేలవుతుంటే చోద్యం చూస్తున్న CBN: జగన్

image

AP: వ్యవసాయం కుప్పకూలిపోతుంటే CM CBN రైతులను వారి విధికి వదిలేసి చోద్యం చూస్తున్నారని YCP చీఫ్ YS జగన్ మండిపడ్డారు. ‘హలో ఇండియా! AP వైపు చూడండి. అక్కడ KG అరటి ₹0.50 మాత్రమే. ఇది నిజం. రైతుల దుస్థితికిది నిదర్శనం. రాష్ట్రంలో ఏ పంటకూ గిట్టుబాటు ధర లభించడం లేదు. మా హయాంలో టన్ను అరటికి 25వేలు ఇచ్చాం. రైతులు నష్టపోకుండా ఢిల్లీకి రైళ్లు ఏర్పాటుచేశాం. కోల్డ్ స్టోరేజీలు పెట్టాం’ అని Xలో పేర్కొన్నారు.