News August 19, 2024
ఎల్లుండి భారత్ బంద్కు పిలుపు

SC వర్గీకరణకు అనుకూలంగా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును వ్యతిరేకిస్తూ AUG 21న భారత్ బంద్కు SC వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి పిలుపునిచ్చింది. ఈ తీర్పుతో తమ హక్కులకు భంగం వాటిల్లుతోందని సమితి కన్వీనర్ సర్వయ్య, కో-కన్వీనర్ చెన్నయ్య అన్నారు. రాజ్యాంగానికి విరుద్ధంగా ఉన్న ఈ తీర్పును వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఎల్లుండి జరిగే బంద్లో SC, ST సంఘాలు, ఉద్యోగ, విద్యార్థి, మహిళలు పాల్గొనాలని కోరారు.
Similar News
News November 18, 2025
BIG BREAKING: లొంగుబాటులో మావో చీఫ్

మావోయిస్టులకు సంబంధించి Way2Newsకు కీలక సమాచారం అందింది. ఆ పార్టీ కేంద్ర కమిటీ కార్యదర్శి తిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్ జీ పోలీసుల అదుపులో ఉన్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. విజయవాడలో అరెస్టైన మావోయిస్టుల్లో 9 మంది దేవ్ జీ సెక్యూరిటీ అని AP ఇంటెలిజెన్స్ చీఫ్ లడ్డా వెల్లడించారు. దీంతో తన గార్డులతో పాటు దేవ్ జీ లొంగిపోయి ఉంటారని తెలుస్తోంది. దీనిపై కొద్ది గంటల్లో అధికార వర్గాల నుంచి ప్రకటన రావచ్చు.
News November 18, 2025
BIG BREAKING: లొంగుబాటులో మావో చీఫ్

మావోయిస్టులకు సంబంధించి Way2Newsకు కీలక సమాచారం అందింది. ఆ పార్టీ కేంద్ర కమిటీ కార్యదర్శి తిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్ జీ పోలీసుల అదుపులో ఉన్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. విజయవాడలో అరెస్టైన మావోయిస్టుల్లో 9 మంది దేవ్ జీ సెక్యూరిటీ అని AP ఇంటెలిజెన్స్ చీఫ్ లడ్డా వెల్లడించారు. దీంతో తన గార్డులతో పాటు దేవ్ జీ లొంగిపోయి ఉంటారని తెలుస్తోంది. దీనిపై కొద్ది గంటల్లో అధికార వర్గాల నుంచి ప్రకటన రావచ్చు.
News November 18, 2025
తెలంగాణలో అతిపెద్ద BESS సౌర ప్రాజెక్టు

TG: బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్ (BESS)తో 1500 MW సౌర విద్యుత్ ప్లాంట్ రాష్ట్రంలో ఏర్పాటుకానుంది. కేంద్రం ఆమోదించిన అతిపెద్ద ప్రాజెక్ట్ ఇది. మహేశ్వరం, చౌటుప్పల్ ప్రాంతాల్లో TGGENCO ఈ ప్లాంట్లను అభివృద్ధి చేస్తుంది. ఈమేరకు ఇంధన శాఖ ముఖ్యకార్యదర్శి GO విడుదల చేశారు. దీని ద్వారా అందే విద్యుత్ యూనిట్ ధర ₹2.90 మాత్రమే. ఇప్పటికే AP, గుజరాత్, ఛత్తీస్గఢ్ ఈ ప్రాజెక్టులను అభివృద్ధి చేస్తున్నాయి.


