News August 22, 2024

రేపు బ్లాక్‌డే పాటించాలని పిలుపు

image

TG: ఆగస్టు 23వ తేదీని బ్లాక్ డేగా పాటించాలని సీపీఎస్ ఉద్యోగుల సంఘం నిర్ణయించింది. పాత పెన్షన్ పునరుద్ధరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఈ మేరకు నిరసన చేపట్టనుంది. 2004 ఆగస్టు 23న సీపీఎస్ విధానం అమల్లోకి వచ్చిన తేదీ కావడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. అటు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు OPS అమలు చేయాలని ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు.

Similar News

News November 17, 2025

పాలనలో తెలుగును ప్రోత్సహించాలి: వెంకయ్య

image

భాష పోతే మన శ్వాస పోయినట్లేనని, తెలుగు పోతే మన వెలుగు పోయినట్లేనని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు చెప్పారు. అదే సమయంలో హిందీని వ్యతిరేకించడంలో అర్థం లేదన్నారు. మన ఎదుగుదలకు హిందీ కూడా ఎంతో అవసరమని తెలిపారు. రామోజీ ఎక్స్‌లెన్స్ అవార్డుల ప్రదానోత్సవంలో ఆయన మాట్లాడారు. పాలనలో తెలుగును ప్రోత్సహించాలని, అన్ని ఆదేశాలూ తెలుగులోనే ఇచ్చేలా చొరవ తీసుకోవాలి AP, TG సీఎంలను కోరారు.

News November 17, 2025

TODAY HEADLINES

image

✦ రాజ్యాంగం వల్లే చాయ్‌వాలా ప్రధాని అయ్యారు: CM CBN
✦ TGకి నాలుగో అద్భుతంగా RFC: CM రేవంత్
✦ రామోజీ ఎక్స్‌లెన్స్ అవార్డుల ప్రదానోత్సవంలో CBN, రేవంత్ సరదా ముచ్చట్లు
✦ TGలో రేషన్ కార్డు ఉంటేనే ఇన్‌కమ్ సర్టిఫికెట్ జారీ
✦ కూటమి ప్రభుత్వంలో భారీగా పెరిగిన అప్పులు: YS జగన్
✦ ఎర్రకోట ఆత్మాహుతి దాడి.. కీలక నిందితుడు అరెస్ట్
✦ తొలి టెస్టులో భారత్‌పై దక్షిణాఫ్రికా విజయం

News November 17, 2025

దక్షిణ చైనా సముద్రంలో బాంబర్ పెట్రోలింగ్

image

వివాదాస్పద దక్షిణ చైనా సముద్రంలో ఉద్రిక్తతలు తలెత్తాయి. ఇటీవల US, జపాన్‌లతో కలిసి ఫిలిప్పీన్స్ అక్కడ నౌకాదళ విన్యాసాలు చేపట్టింది. దీనికి కౌంటర్‌గా చైనా తొలిసారిగా యుద్ధ విమానాలతో బాంబర్ ఫార్మేషన్ పెట్రోలింగ్ నిర్వహించింది. రెచ్చగొట్టే చర్యలు మానుకోవాలని ఫిలిప్పీన్స్‌ను హెచ్చరించింది. దక్షిణ చైనా సముద్రమంతా తమదేనని డ్రాగన్ వాదిస్తుండగా దీనికి చెక్ పెట్టేందుకే ఫిలిప్పీన్స్ విన్యాసాలు చేపట్టింది.