News October 29, 2024
శిల్పాశెట్టి రెస్టారెంట్లో రూ.80లక్షల కారు చోరీ

బాలీవుడ్ నటి శిల్పాశెట్టికి చెందిన రెస్టారెంట్లో ఖరీదైన కారు మాయం కావడం చర్చనీయాంశమైంది. ముంబైలో దాదర్ వెస్ట్లోని కోహినూర్ స్క్వేర్ 48వ అంతస్తులో ఉన్న బాస్టియన్ ఎట్ ది టాప్ రెస్టారెంట్కు ఓ కస్టమర్ వచ్చారు. రూ.80లక్షల ఖరీదైన BMW Z4 కారును పార్క్ చేయమని రెస్టారెంట్ సిబ్బందికి కీస్ ఇచ్చారు. 1amకి భోజనం చేసి వచ్చేలోపు ఆ కారు మాయమైంది. ఇద్దరు దుండగులు కారు ఎత్తుకెళ్లినట్లు CCTV ఫుటేజ్లో తేలింది.
Similar News
News January 31, 2026
రాష్ట్రానికి నిధుల కోసం ఐక్యంగా పోరాడాలి: పొన్నం

TG: తెలంగాణ పుట్టుకనే PM మోదీ అవమానించారని, రాష్ట్రంపై చిన్నచూపు చూస్తున్నారని మంత్రి పొన్నం ప్రభాకర్ విమర్శించారు. గాంధీ భవన్లో ఆయన మాట్లాడుతూ 11 ఏళ్లుగా కేంద్ర బడ్జెట్లో అన్యాయం జరుగుతోందన్నారు. ఈసారైనా RRR, మెట్రో, ఫ్యూచర్ సిటీకి నిధులు కేటాయించాలని కోరారు. విజన్ 2047కు అనుగుణంగా కేంద్రం మద్దతు తెలపాలని డిమాండ్ చేశారు. ఇందుకోసం బీజేపీ సహా రాష్ట్ర ఎంపీలతో ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు.
News January 31, 2026
కొర్ర పంటలో వెర్రి కంకి తెగులు నివారణ ఎలా?

ప్రస్తుతం తేమతో కూడిన వాతావరణం వల్ల కొర్ర పంటలో వెర్రి కంకి తెగులు ఆశించే అవకాశం ఉంటుంది. దీని వల్ల ఆకుల అడుగున బూజు లాంటి శిలీంధ్రం పెరుగుదల కనిపిస్తుంది. అలాగే మొక్క నుంచి బయటకు వచ్చిన కంకులు ఆకుపచ్చని ఆకుల మాదిరిగా మారతాయి. ఈ తెగులు నివారణకు కిలో విత్తనానికి రిడోమిల్ 3 గ్రాములను కలిపి విత్తనశుద్ధి చేయాలి. పంటలో తెలుగు లక్షణాలు కనిపిస్తే లీటరు నీటికి రిడోమిల్ 3గ్రాములను కలిపి పిచికారీ చేయాలి.
News January 31, 2026
కుప్పంలో ప్రయోగం… రాష్ట్రమంతా అమలు: CM

AP: కుప్పం నియోజకవర్గం ఓ ప్రయోగశాల అని, ప్రతి కార్యక్రమాన్ని ఇక్కడ విజయవంతం చేసి రాష్ట్రమంతా అమలు చేస్తామని CM చంద్రబాబు పేర్కొన్నారు. ‘లక్షమందిని పారిశ్రామికవేత్తలుగా చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. వన్ ఫ్యామిలీ వన్ ఆంత్రప్రెన్యూర్ ద్వారా దీన్ని అమలు చేస్తున్నాం. స్వర్ణాంధ్ర విజన్తో APని అగ్రస్థానంలో నిలబెడతాం. కుప్పం దానికి మొదటి మెట్టు. ఇక్కడ ₹7088 CRతో 16 పరిశ్రమలు వచ్చాయి’ అని వివరించారు.


