News May 3, 2024

అమిత్ షాపై కేసు నమోదు

image

కేంద్ర హోంమంత్రి అమిత్ షాపై ఎన్నికల కోడ్ ఉల్లంఘన కేసు నమోదైంది. EC ఆదేశాలతో HYDలోని మొఘల్‌పురా పీఎస్‌లో సెక్షన్ 188 కింద పోలీసులు కేసు నమోదు చేశారు. కాంగ్రెస్ నేత నిరంజన్ చేసిన ఫిర్యాదుతో CEC చర్యలు తీసుకుంది. దీనిపై విచారణ జరపాలని HYD CPని ఆదేశించింది. ఎన్నికల నియమాలను ఉల్లంఘిస్తూ ఆయన చిన్నారులతో ప్రచారం చేయించారని నిరంజన్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు.

Similar News

News November 27, 2025

పాలమూరు: మాజీ సర్పంచ్ హత్య.. చేసింది వీళ్లే.!

image

కేటీదొడ్డి మండలం నందిన్నె మాజీ సర్పంచ్ చిన్న భీమరాయుడు హత్య కేసులో పోలీసులు పది మంది నిందితులను అరెస్టు చేశారు. వారి నుంచి రూ.8.5 లక్షల నగదు, నాలుగు కార్లు, రెండు బైకులు, ఒక బొలెరో వాహనం, 11 మొబైల్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఇటీవల ధరూర్ మండలం జాంపల్లి వద్ద చిన్న భీమరాయుడును బొలెరో వాహనంతో ఢీకొట్టి హత్య చేసిన విషయం తెలిసిందే.

News November 27, 2025

పసిపిల్లలు సరిపడా పాలు తాగుతున్నారా?

image

ఆరు నెలల లోపు శిశువులకు తల్లి పాలను మించిన సంపూర్ణ ఆహారం లేదు. అయితే శిశువు తగినన్ని పాలు తాగుతున్నారో.. లేదో తెలుసుకోవడానికి వారి మూత్రాన్ని పరిశీలించాలంటున్నారు నిపుణులు. శిశువులు ప్రతి 4 నుంచి 6 గంటలకు మూత్ర విసర్జన చేస్తారు. ఆ యూరిన్‌ రంగు నీటిలా ఉంటే వాళ్లు పాలు సరిగ్గా తాగుతున్నారని అర్థం. అలాగే బిడ్డకు ప్రతి మూడుగంటలకు పాలివ్వాలి. రాత్రిపూట కూడా 2,3సార్లు పాలు పట్టించాలని చెబుతున్నారు.

News November 27, 2025

ANRFలో ఉద్యోగాలు.. అప్లై చేశారా?

image

అనుసంధాన్ నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్( <>ANRF<<>>)లో 7 పోస్టులకు దరఖాస్తు గడువును పొడిగించారు. అర్హతగల అభ్యర్థులు జనవరి 14 వరకు అప్లై చేసుకోవచ్చు. మాస్టర్ డిగ్రీ, బ్యాచిలర్ డిగ్రీ(ఇంజినీరింగ్) ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. జీతం సైంటిస్ట్-Dకు నెలకు రూ.78,800-రూ.2,09200, సైంటిస్ట్ -C పోస్టుకు రూ.67,700-రూ.2,08700 చెల్లిస్తారు. వెబ్‌సైట్: serb.gov.in/