News July 6, 2024
భోలే బాబాపై కేసు నమోదు

హాథ్రస్ తొక్కిసలాటలో 121 మంది మృతికి కారణమైన భోలే బాబా అలియాస్ సూరజ్ పాల్ సింగ్పై ఎట్టకేలకు కేసు నమోదైంది. ప్రస్తుతం అతడు పరారీలో ఉండటంతో ఆచూకీ కోసం పోలీసులు గాలిస్తున్నారు. మరోవైపు సత్సంగ్కు అనుమతి తీసుకున్న దేశ్ ప్రకాశ్ మధుకర్ను ప్రధాన నిందితుడిగా పేర్కొంటూ పోలీసులు ఇప్పటికే అరెస్ట్ చేశారు. దర్యాప్తులో మరిన్ని విషయాలు తెలుస్తాయని హాథ్రస్ ఎస్పీ నిపుణ్ అగర్వాల్ తెలిపారు.
Similar News
News September 16, 2025
విగ్రహం వ్యవహారం.. భూమనపై కేసు నమోదు

AP: వైసీపీ నేత, టీటీడీ మాజీ ఛైర్మన్ భూమన <<17725838>>కరుణాకర్<<>> రెడ్డిపై కేసు నమోదైంది. భూమన శ్రీవారి భక్తుల మనోభావాలు దెబ్బతీశారని టీటీడీ డిప్యూటీ ఈవో ఫిర్యాదుతో అలిపిరి పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా తిరుమలలో విష్ణుమూర్తి విగ్రహానికి అపచారం జరిగిందని భూమన ఆరోపించారు. అయితే అది విష్ణు విగ్రహం కాదని శనీశ్వరుడి విగ్రహం అని <<17730080>>ఏపీ ఫ్యాక్ట్చెక్<<>> స్పష్టం చేసిన విషయం తెలిసిందే.
News September 16, 2025
పార్టీ మారిన ఎమ్మెల్యేలు ఎందుకు పిరికివాళ్లుగా మారారు: KTR

TG: పార్టీ మారిన MLAలు ఎన్ని తమాషాలు చేసినా ఉప ఎన్నికలు తప్పవని KTR అన్నారు. వాళ్లు ఎందుకు పిరికివాళ్లుగా మారిపోయారో చెప్పాలన్నారు. ‘రేవంత్ చేతిలో మోసపోవడంలో ప్రజల తప్పు లేదు. కాంగ్రెస్ మోసాన్ని ప్రజలకు వివరించడంలో మేం విఫలమయ్యాం. చేసిన మంచిని, అభివృద్ధిని చెప్పుకోలేకపోయాం. ఆ రోజే కాంగ్రెస్ దొంగ పార్టీ అని వివరిస్తే బాగుండేది. INCకి దమ్ముంటే ఉపఎన్నికకు వెళ్లాలి’ అని పేర్కొన్నారు.
News September 16, 2025
HYD మెట్రోలో సెక్యూరిటీ గార్డులుగా ట్రాన్స్జెండర్లు

TG: హైదరాబాద్లోని మెట్రో రైళ్లలో ట్రాన్స్జెండర్లను సెక్యూరిటీ గార్డులుగా నియమిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు 20 మంది హిజ్రాలకు మంత్రి అడ్లూరి లక్ష్మణ్ అపాయింట్మెంట్ లెటర్స్ అందజేశారు. గార్డుల నియామకాల కోసం 400 మంది దరఖాస్తు చేసుకోగా నైపుణ్యం ఉన్న వారిని ఎంపిక చేసినట్లు వివరించారు. ట్రాన్స్జెండర్లు సమాజంలో గౌరవంగా బతకాలనే ఉద్దేశంతోనే ఈ అవకాశం కల్పించినట్లు మంత్రి తెలిపారు.