News November 16, 2024

మహాసేన రాజేశ్‌పై కేసు నమోదు

image

AP: టీడీపీ అధికార ప్రతినిధి మహాసేన రాజేశ్‌, అతని అనుచరులపై కేసు నమోదైంది. తన ఫొటోలు మార్ఫింగ్ చేసి పోస్టులు పెట్టారని ఓ మహిళ ఫిర్యాదు చేయగా, కోనసీమ జిల్లా మలికిపురం స్టేషన్లో కేసు నమోదైంది. మార్ఫింగ్‌పై ఫేస్‌బుక్‌ నుంచి వివరాలు కోరామని, స్పష్టత రాగానే చర్యలుంటాయని పోలీసులు చెప్పారు. రాజేశ్ మాట్లాడుతూ.. తన పేరుతో ఎవరో ఫేక్ అకౌంట్లు క్రియేట్ చేశారనన్నారు. ఆ పోస్టులతో తనకు సంబంధం లేదని చెప్పారు.

Similar News

News December 1, 2025

ఆఖరి రాగం పాడేద్దామా..!

image

చూస్తుండగానే 2025లో డిసెంబర్ వచ్చేసింది. 30 రోజులు ఆగితే చివరి పేజీ కూడా చిరిగిపోతుంది. 2025ను సెల్ఫ్ రివ్యూ చేసుకుంటే.. ఎన్నో జ్ఞాపకాలు, ఘటనలు, గుణపాఠాలు. కొన్ని స్వీట్‌గా, కొన్ని ఘాటుగా, ఇంకొన్ని కాస్త కాస్ట్లీ. మిక్చర్ ప్యాకెట్ లాంటి మిక్స్డ్ ఫీల్ ఇయర్‌లో మీ బెస్ట్ ప్లేస్, మెమొరి, బ్యాడ్ డే.. ఇలా డైలీ ఓ విషయం షేర్ చేసుకుందాం. ఈ ఇయర్‌కు ఇలా ఆఖరి రాగం పాడేద్దాం!
రోజూ 7pmకు స్పెషల్‌గా కలుద్దాం.

News December 1, 2025

ఆ డాక్టర్లకు 50శాతం ఇన్సెంటివ్!

image

TG: గిరిజన జిల్లాల్లోని ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రొఫెసర్లు, టీచింగ్ ఫ్యాకల్టీకి బేసిక్ పేలో 50% అదనపు ఇన్సెంటివ్ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ట్రైబల్ ఏరియాకు వెళ్లేందుకు డాక్టర్లు ఇష్టపడట్లేదు. ఫలితంగా కాలేజీల్లో ఫ్యాకల్టీ కొరత ఏర్పడి గుర్తింపు కోల్పోయే ప్రమాదముంది. దీంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. భద్రాద్రి, ఆసిఫాబాద్, MLG, MHBD, భూపాలపల్లి కాలేజీలు గిరిజన ప్రాంతాల పరిధిలోకి వస్తాయి.

News December 1, 2025

శ్రీకాంత్ మాల్డే, చార్మి బిజినెస్ సక్సెస్ సీక్రెట్ ఇదే

image

శ్రీకాంత్, చార్మి ఎప్పుడూ సాదా సీదా జీవితాన్ని గడపడం, కల్తీలేని ఆర్గానిక్ పద్ధతిని ఎంచుకోవడం, వినియోగదారులతో నిజాయితీగా వ్యవహరించడం చుట్టు పక్కల జనానికి, వారి దగ్గర పాల ఉత్పత్తులను కొనేవారికి బాగా నచ్చింది. ముఖ్యంగా మౌత్ పబ్లిసిటీతోనే వారి వ్యాపారం బాగా జరిగింది. ఫలితంగా రోజురోజుకీ వారి ఉత్పత్తులకు డిమాండ్ పెరిగి 2024 నాటికే రూ.2 కోట్ల టర్నోవర్ సాధించి, ఇప్పుడు మరింత ఆదాయం దిశగా దూసుకెళ్తున్నారు.