News July 3, 2024
ఎమ్మెల్సీ రామచంద్రారెడ్డిపై కేసు నమోదు
AP: సాయిబాబా పాఠశాలల ఛైర్మన్, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ రామచంద్రారెడ్డిపై కేసు నమోదైంది. కడప జిల్లా అక్కాయపల్లిలోని సాయిబాబా పాఠశాలలో పైకప్పు పెచ్చులూడి మీద పడటంతో ఆరుగురు విద్యార్థులకు గాయాలయ్యాయి. దీంతో వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. యజమాన్యం నిర్లక్ష్యం వల్లే పైకప్పు కూలిందని పోలీసులు ఎమ్మెల్సీపై కేసు నమోదు చేశారు.
Similar News
News September 20, 2024
లడ్డూ వివాదం.. హైకోర్టుకు వైసీపీ!
AP: తిరుమల లడ్డూ వివాదంపై వైసీపీ హైకోర్టును ఆశ్రయించనుంది. తమపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేయనుంది. అయితే వచ్చే బుధవారం వాదనలు వింటామని ఉన్నత న్యాయస్థానం తెలిపింది. కాగా, గత ప్రభుత్వ హయాంలో లడ్డూ తయారీలో జంతువుల కొవ్వుతో చేసిన నెయ్యి వాడారని సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించడం సంచలనంగా మారింది.
News September 20, 2024
సిద్దరామయ్య X గవర్నర్: ముడా కేసులో మరో ట్విస్ట్
కర్ణాటక CM సిద్దరామయ్యపై అన్ని డాక్యుమెంట్లు సహా డీటెయిల్డ్ రిపోర్టు ఇవ్వాలని చీఫ్ సెక్రటరీ షాలినీ రజనీశ్ను గవర్నర్ థావర్చంద్ గహ్లోత్ ఆదేశించారు. KUDA చట్టానికి విరుద్ధంగా తన నియోజకవర్గం వరుణ, శ్రీరంగపట్నలో రూ.387 కోట్ల పనులు చేపట్టాలని MUDAను మౌఖికంగా ఆదేశించారని సీఎంపై గవర్నర్ వద్ద మరో పిటిషన్ దాఖలైంది. అధికార దుర్వినియోగంపై CBIతో దర్యాప్తు చేయించాలని పిటిషనర్ కోరడంతో గవర్నర్ స్పందించారు.
News September 20, 2024
‘దేవర’ ప్రీరిలీజ్ ఈవెంట్కు ముగ్గురు టాప్ డైరెక్టర్లు!
ఎన్టీఆర్ హీరోగా డైరెక్టర్ కొరటాల శివ తెరకెక్కించిన ‘దేవర’ ఈ నెల 27న విడుదలకు సిద్ధమైంది. ఇప్పటికే విపరీతమైన హైప్ క్రియేట్ చేసిన ఈ మూవీ గురించి ఇప్పుడు మరో న్యూస్ చక్కర్లు కొడుతోంది. ఈ నెల 22న జరిగే ప్రీరిలీజ్ ఈవెంట్కు టాప్ డైరెక్టర్లు రాజమౌళి, త్రివిక్రమ్, ప్రశాంత్ నీల్ హాజరవుతారని చర్చ సాగుతోంది. అయితే ఈవెంట్ ఎక్కడ నిర్వహిస్తున్నారనేది మాత్రం ఇంకా వెల్లడికాలేదు.