News May 21, 2024

ఉప ముఖ్యమంత్రిపై కేసు నమోదు

image

AP: కడప గౌస్‌నగర్‌లో జరిగిన అల్లర్ల ఘటనలో ఉప ముఖ్యమంత్రి అంజద్ బాషాపై టూటౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఆయనతో పాటు 21 మంది వైసీపీ కార్యకర్తలపై కేసు నమోదు చేశారు. ఇటు టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసులు రెడ్డితో పాటు 24 మంది టీడీపీ కార్యకర్తల పైనా కేసులు నమోదయ్యాయి.

Similar News

News November 13, 2025

MCEMEలో 49 పోస్టులు.. అప్లైకి రేపే లాస్ట్ డేట్

image

మిలటరీ కాలేజీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ మెకానికల్ ఇంజినీరింగ్(MCEME)49 గ్రూప్-C పోస్టులకు అప్లై చేయడానికి రేపే ఆఖరు తేదీ. పోస్టును బట్టి టెన్త్, ఇంటర్, డిప్లొమా, డిగ్రీ అర్హతగల అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. వయసు 18-25ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వేషన్ గలవారికి ఏజ్‌లో సడలింపు ఉంది. రాత పరీక్ష, స్కిల్ టెస్ట్/PET&PST, మెడికల్ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు.

News November 13, 2025

హనుమాన్ చాలీసా భావం – 8

image

ప్రభు చరిత్ర సునివే కో రసియా |
రామ లఖన సీతా మన బసియా ||
భావం: రాముడి చరిత్రను వినడానికి ఆసక్తి చూపిన వారి మనసులో రాముడు, లక్ష్మణుడు, సీతమ్మ నివాసం ఉంటారు.
సుగుణాల రాముడి కథలను వినడం, పఠించడం వల్ల మనసు పరిశుద్ధమవుతుంది. ఫలితంగా ఆ దేవదేవుడు మన హృదయ మందిరంలో స్థిరంగా నిలుస్తాడు. నిత్యం దైవ స్మరణలో ఉంటే జీవితం ధర్మబద్ధంగా, శాంతియుతంగా ఉంటుందని ఈ శ్లోకం బోధిస్తోంది. <<-se>>#HANUMANCHALISA<<>>

News November 13, 2025

ఢిల్లీ పేలుడు.. కారులో డీఎన్ఏ ఉమర్‌దే!

image

ఢిల్లీలోని ఎర్రకోట వద్ద కారు బ్లాస్ట్‌లో మరణించింది డాక్టర్ ఉమర్ అని అధికార వర్గాలు తెలిపాయని INDIA TODAY పేర్కొంది. కారులోని డీఎన్ఏ, ఉమర్ కుటుంబ సభ్యులతో సరిపోలిందని వెల్లడించింది. i20 కారుతో ఎర్రకోట సిగ్నల్ వద్ద ఆత్మహుతి దాడికి పాల్పడిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో 12 మంది మరణించారు. కాగా ఉమర్ పేరిట ఉన్న మరో కారును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.