News September 14, 2024
నటి జెత్వానీ ఫిర్యాదుతో వైసీపీ నేతపై కేసు నమోదు

AP: ముంబై నటి కాదంబరి జెత్వానీ కేసులో కుక్కల విద్యాసాగర్తో పాటు మరికొందరిపై ఇబ్రహీంపట్నం పోలీసులు కేసు నమోదు చేశారు. తనపై YCP నాయకుడు విద్యాసాగర్తో తప్పుడు ఫిర్యాదు చేయించారని ఆమె నిన్న రాత్రి ఫిర్యాదు చేశారు. తనను నిర్బంధించి, చిత్ర హింసలకు గురి చేశారని పేర్కొన్నారు. కాగా ఈ కేసులో ఇప్పటికే ఇద్దరు పోలీసులు సస్పెండ్ అవ్వగా, కీలకంగా వ్యవహరించిన IPSలపైనా చర్యలకు రంగం సిద్ధమైనట్లు తెలుస్తోంది.
Similar News
News December 24, 2025
తాడేపల్లి: పవన్ రాక.. నాగేశ్వరమ్మ సంతోషానికి హద్దులు లేవు.!

డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ రాకతో ఇండ్ల నాగేశ్వరమ్మ సంతోషం ఆకాశాన్ని తాకింది. ఇచ్చిన మాట ప్రకారం జనసేన అధినేత వస్తున్నాడని సమాచారంతో బుధవారం ఆమె ఇప్పటం గ్రామంలోని తన ఇంటిని పార్టీ జెండాలతో అలంకరణ చేసి, పుష్పాలతో స్వాగతం పలికారు. బంగారు కొండని సంబోధిస్తూ ఎంతో ఆప్యాయంగా పవన్ను ఆహ్వానించారు. పవన్ తన జీతం నుంచి రూ.5వేలు ప్రతినెల పెన్షన్ రూపంలో ఇస్తానని హామీ ఇవ్వడంతో నాగేశ్వరమ్మ ఎమోషనల్ అయ్యారు.
News December 24, 2025
కలెక్షన్ల సునామీ.. రూ.1,000 కోట్ల దిశగా ‘ధురంధర్’

రణ్వీర్ సింగ్ నటించిన ‘ధురంధర్’ సినిమా కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా 3 వారాల్లో రూ.925 కోట్ల(గ్రాస్)ను సాధించింది. రెండుమూడు రోజుల్లో రూ.వెయ్యి కోట్ల మార్క్ చేరనున్నట్లు బాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం కలెక్షన్ల పరంగా యానిమల్(రూ.917 కోట్లు)ను బీట్ చేసి 9వ స్థానానికి చేరింది. ఇదే జోరు కొనసాగితే కేజీఎఫ్-2, జవాన్, పఠాన్, కల్కి రికార్డులు బ్రేకవడం గ్యారంటీ.
News December 24, 2025
కన్నప్రేమ నేర్పిన నాయకత్వం: సత్య నాదెళ్ల విజయ రహస్యం

మైక్రోసాఫ్ట్ CEO సత్య నాదెళ్ల నాయకత్వ శైలి మారడానికి ఆయన పిల్లలే ప్రధాన కారణం. పుట్టుకతోనే ప్రత్యేక అవసరాలున్న తన పిల్లలను చూశాక లోకాన్ని చూసే కోణం మారిందన్నారు ఆయన ఓ సందర్భంలో. ఎదుటివారి కష్టాన్ని అర్థం చేసుకునే గుణం నాయకుడికి ఉండాలని గ్రహించారు. ముఖ్యంగా అంగవైకల్యం ఉన్నవారికి సాంకేతికత అందాలనే లక్ష్యంతో పనిచేశారు. తన పిల్లల వల్ల కలిగిన ఈ అనుభవాలే ఆయన్ను గొప్ప నాయకుడిగా తీర్చిదిద్దాయి.


