News July 20, 2024
బాలికపై హత్యాచారం కేసు.. ఓ వ్యక్తి లాకప్ డెత్?

AP: నంద్యాల(D) ముచ్చుమర్రిలో బాలిక హత్యాచారం కేసులో షాకింగ్ పరిణామం చోటు చేసుకుంది. బాలిక మృతదేహాన్ని మాయం చేసేందుకు ముగ్గురు మైనర్లకు సహకరించిన నలుగురు కుటుంబసభ్యులను పోలీసులు మూడు రోజుల క్రితం కస్టడీలోకి తీసుకున్నారు. అందులో ఒకరైన హుస్సేన్ (నందికొట్కూర్) ఈ తెల్లవారుజామున PSలో మరణించాడు. పోలీసులు విచారణ పేరుతో తీవ్రంగా హింసించడం వల్లే చనిపోయినట్లు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
Similar News
News October 20, 2025
ప్రమోద్ కుటుంబానికి రూ.కోటి పరిహారం: డీజీపీ

TG: నిజామాబాద్లో హత్యకు గురైన కానిస్టేబుల్ ప్రమోద్ కుటుంబానికి డీజీపీ శివధర్ రూ.కోటి పరిహారం ప్రకటించారు. ఆయన కుటుంబ సభ్యుల్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామన్నారు. పదవీ విరమణ వరకు వచ్చే శాలరీ అందిస్తామని, 300 గజాల ఇంటి స్థలం మంజూరు చేయిస్తామన్నారు. పోలీస్ భద్రత సంక్షేమం నుంచి రూ.16 లక్షలు, పోలీస్ వెల్ఫేర్ నుంచి రూ.8 లక్షల పరిహారాన్ని రేపు అమరవీరుల సభలో సీఎం ప్రకటిస్తారని వెల్లడించారు.
News October 20, 2025
రియాజ్ మృతిని ధ్రువీకరించిన DGP

TG: ఎన్కౌంటర్లో <<18056602>>రియాజ్<<>> మృతిని డీజీపీ శివధర్ రెడ్డి ధ్రువీకరించారు. ‘నిజామాబాద్ ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రియాజ్ ఇవాళ బాత్రూం కోసం వెళ్లి తప్పించుకునేందుకు ప్రయత్నించాడు. అతడిని పట్టుకునేందుకు పోలీసులు తీవ్రంగా ప్రయత్నించారు. పోలీసుల నుంచి వెపన్ తీసుకుని రియాజ్ కాల్పులకు యత్నించాడు. ఆత్మరక్షణ కోసం పోలీసులు కాల్పులు జరపడంతో రియాజ్ చనిపోయాడు’ అని డీజీపీ వెల్లడించారు.
News October 20, 2025
నిజామాబాద్లో ఆ రోజు ఏం జరిగింది?

TG: ఓ కేసు విషయంలో కానిస్టేబుల్ ప్రమోద్ శుక్రవారం <<18056602>>రియాజ్ను<<>> పట్టుకుని బైకుపై PSకు తీసుకెళ్లేందుకు ప్రయత్నించారు. రియాజ్ తన దగ్గర ఉన్న కత్తితో ప్రమోద్ ఛాతిలో పొడిచి పారిపోయాడు. ఆ క్రమంలో ఓ ఎస్సైపైనా దాడికి పాల్పడ్డాడు. ప్రమోద్ను ఆస్పత్రికి తరలించగా అప్పటికే చనిపోయాడని వైద్యులు వెల్లడించారు. రియాజ్పై చైన్ స్నాచింగ్, దొంగతనాలు, గొడవల వంటి 60కి పైగా కేసులున్నాయి. నాలుగైదుసార్లు జైలుకెళ్లొచ్చాడు.