News December 14, 2024
హైబ్రిడ్ మోడల్లోనే ఛాంపియన్స్ ట్రోఫీ?

ఛాంపియన్స్ ట్రోఫీ 2025 హైబ్రిడ్ మోడల్లోనే జరుగుతుందని తెలుస్తోంది. దీనిపై ఇవాళ పీసీబీ ఛైర్మన్ మొహ్సిన్ నఖ్వీ స్వయంగా ప్రకటన చేస్తారని సమాచారం. అలాగే భారత్ ఆడే మ్యాచులన్నీ దుబాయ్ వేదికగా జరుగుతాయని తెలుస్తోంది. ఇకపై చిరకాల ప్రత్యర్థుల మధ్య మ్యాచులన్నీ తటస్థ వేదికల్లో జరుగుతాయి. వచ్చే ఏడాది ఇండియాలో జరిగే వుమెన్స్ వరల్డ్ కప్లో కూడా దాయాదులు హైబ్రిడ్ పద్ధతిలోనే ఆడే అవకాశం ఉంది.
Similar News
News November 26, 2025
గ్లోబల్ సమ్మిట్కు PMను ఆహ్వానించాలి: సీఎం

TG: తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్-2025 ప్రారంభోత్సవానికి PM మోదీ, కేంద్ర మంత్రులను ఆహ్వానించాలని CM రేవంత్ రెడ్డి సూచించారు. పెట్టుబడులపై ఒప్పందాల విషయంలో ప్లాన్ ప్రకారం ముందుకెళ్లాలని అధికారులను ఆదేశించారు. వివిధ విభాగాలపై స్టాల్స్, రాష్ట్ర బ్రాండ్ ఇమేజ్ పెంచేలా డ్రోన్ షో, సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని సమీక్షలో పేర్కొన్నారు. 2,600 మందికి ఆహ్వానం అందించామని CMకు అధికారులు తెలియజేశారు.
News November 26, 2025
గ్లోబల్ సమ్మిట్కు PMను ఆహ్వానించాలి: సీఎం

TG: తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్-2025 ప్రారంభోత్సవానికి PM మోదీ, కేంద్ర మంత్రులను ఆహ్వానించాలని CM రేవంత్ రెడ్డి సూచించారు. పెట్టుబడులపై ఒప్పందాల విషయంలో ప్లాన్ ప్రకారం ముందుకెళ్లాలని అధికారులను ఆదేశించారు. వివిధ విభాగాలపై స్టాల్స్, రాష్ట్ర బ్రాండ్ ఇమేజ్ పెంచేలా డ్రోన్ షో, సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని సమీక్షలో పేర్కొన్నారు. 2,600 మందికి ఆహ్వానం అందించామని CMకు అధికారులు తెలియజేశారు.
News November 26, 2025
ఉత్తరం దిశలో తలపెట్టి ఎందుకు నిద్రించకూడదు?

ఉత్తరం దిశలో తలపెట్టి నిద్రించడం ఆరోగ్యానికి మంచిది కాదని వాస్తు నిపుణులు కృష్ణాదిశేషు సూచిస్తున్నారు. ఆ దిశలో ప్రవహించే అయస్కాంత తరంగాలు మెదడు శక్తిని తగ్గిస్తాయని అంటున్నారు. ‘ఇలా పడుకుంటే రక్త ప్రసరణలో ఒడిదొడుకులు కలుగుతాయి. దీనివల్ల నిద్రలేమి, పీడకలలు, ఆందోళన వంటి సమస్యలు వస్తాయి. శాస్త్రానుసారం.. మెదడుపై ప్రతికూల ప్రభావం పడకుండా ఉండటానికి ఈ దిశను నివారించడం ఉత్తమం’ అని చెబుతున్నారు. <<-se>>#Vasthu<<>>


