News December 2, 2024

సమగ్ర విచారణకు ఆదేశించాలి.. CMకు పవన్ రిక్వెస్ట్

image

AP: కాకినాడ పోర్టు నుంచి విదేశాలకు రేషన్ బియ్యం అక్రమ రవాణా జరుగుతోందని, దీనిపై సమగ్ర విచారణకు ఆదేశించాలని CM చంద్రబాబును Dy.CM పవన్ కోరారు. గత మూడేళ్లలో ₹48,537CR విలువైన బియ్యం కాకినాడ పోర్టు నుంచి తరలించారని, దీనిపై వాస్తవాలు బయటకు తీయాల్సిన అవసరం ఉందన్నారు. YCP ప్రభుత్వ హయాంలో పోర్టులోకి ఎవరినీ అనుమతించలేదని, ఇటీవల అక్కడికి వెళ్లిన తనకూ ఇబ్బంది ఎదురైందని సీఎం దృష్టికి తీసుకెళ్లారు.

Similar News

News November 1, 2025

పోలవరం నిర్వాసితులకు రూ 1000 కోట్లు పంపిణీ

image

AP: పోలవరం భూ నిర్వాసితులకు రూ.1000 కోట్లు పంపిణీ చేశారు. ఈ మేరకు నిర్వాసితుల అకౌంట్లలో నగదు జమ చేసినట్లు మంత్రి రామనాయుడు వెల్లడించారు. ఏలూరులోని వేలేరుపాడులో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. కూటమి ప్రభుత్వం అందరికీ అండగా నిలుస్తుందన్నారు. భూసేకరణ, పరిహారం చెల్లింపుల్లో దళారుల మాట నమ్మొద్దని సూచించారు. 2027కల్లా పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఉన్నట్లు చెప్పారు.

News November 1, 2025

ఢిల్లీకి సంజూ.. రాజస్థాన్‌కు స్టబ్స్?

image

IPL వేలానికి ముందు రాజస్థాన్ రాయల్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య కీలక స్వాప్ డీల్ పూర్తయినట్లు సమాచారం. RR కెప్టెన్ సంజూ శాంసన్, DC ప్లేయర్ ట్రిస్టన్ స్టబ్స్ జట్లు మారడం ఖాయమైనట్లు తెలుస్తోంది. త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడనుందని IPL వర్గాలు చెబుతున్నాయి. KL రాహుల్ పేరు కూడా చర్చల్లోకి వచ్చినప్పటికీ ఆయనను వదులుకోవడానికి ఢిల్లీ సుముఖత చూపలేదు. 2026 సీజన్‌కు సంజూను కెప్టెన్ చేయాలని DC భావిస్తోంది.

News November 1, 2025

కాసేపట్లో వర్షం

image

TG: రాష్ట్రంలోని పలు జిల్లాల్లో రానున్న 2-3 గంటల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని HYD వాతావరణ కేంద్రం తెలిపింది. నల్గొండ జిల్లాలో ఉరుములతో కూడిన వర్షాలు పడతాయని ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. హైదరాబాద్, జనగాం, ఆసిఫాబాద్, మంచిర్యాల, రంగారెడ్డి, యాదాద్రిలో తేలికపాటి వర్షం పడే ఛాన్స్ ఉందని ఎల్లో అలర్ట్ ఇచ్చింది. గంటకు 40కి.మీ. వేగంతో గాలులు వీస్తాయని పేర్కొంది.