News April 17, 2025

రోహిత్, కోహ్లీ, బుమ్రాకు A+ కాంట్రాక్ట్?

image

రోహిత్, కోహ్లీ, బుమ్రాకు BCCI A+ కాంట్రాక్ట్ కేటాయించనున్నట్లు సమాచారం. బోర్డు వర్గాల్ని ఉటంకిస్తూ స్పోర్ట్స్‌తక్ ఈ విషయాన్ని తెలిపింది. మూడు ఫార్మాట్లలోనూ ఆడుతున్న అగ్ర క్రికెటర్లకు మాత్రమే బోర్డు A+ గ్రేడ్ కేటాయిస్తోంది. రోహిత్, కోహ్లీ ఇప్పటికే టీ20లకు వీడ్కోలు పలికారు. వన్డేలు, టెస్టులు మాత్రమే ఆడుతున్నారు. ఈ నేపథ్యంలో వారికి A+ గ్రేడ్ దక్కుతుందా లేదా అన్న ఆసక్తి క్రికెట్ వర్గాల్లో నెలకొంది.

Similar News

News April 19, 2025

RBI వద్ద 879 టన్నుల పసిడి నిల్వలు

image

ఈ ఏడాది ఫిబ్రవరి నాటికి RBI వద్ద 879 టన్నుల బంగారం నిల్వలు ఉన్నాయి. దీని విలువ రూ.6.83 లక్షల కోట్లు అని అంచనా. అంతర్జాతీయ ఆర్థిక అనిశ్చితులు, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తల నేపథ్యంలో పసిడి నిల్వలు పెంచుకునేందుకు RBI ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగా 2024లో ఏకంగా 72.6 టన్నుల బంగారాన్ని కొనుగోలు చేసింది. ప్రపంచ దేశాల సెంట్రల్ బ్యాంకులన్నీ పసిడి నిల్వలు పెంచుకుంటున్న క్రమంలో RBI కూడా అదే కోవలో పయనిస్తోంది.

News April 19, 2025

JEE టాప్-10 ర్యాంకర్స్ వీరే

image

JEE ఫలితాలను ఎన్టీఏ విడుదల చేసింది. ఇందులో రాజస్థాన్‌కు చెందిన ఇద్దరు తొలి రెండు ర్యాంకుల్లో నిలిచారు. మూడు, నాలుగు ర్యాంకులను పశ్చిమ బెంగాల్‌కు చెందిన విద్యార్థులు కైవసం చేసుకున్నారు. 1.MD అనాస్, 2.ఆయుష్ సింఘాల్(RJ), 3.అర్చిష్మాన్ నాండీ, 4.దేవదత్త మాఝీ(WB), 5.రవి చౌదరి(MH), 6.లక్ష్య శర్మ(RJ), 7.కుషాగ్ర గుప్తా(KN), 8.హర్ష్ ఏ గుప్తా(TG), 9.ఆదిత్ ప్రకాశ్ భగాడే(GJ), 10.దక్ష్ (DL).

News April 19, 2025

30 ఏళ్లు దాటిన మహిళలకు అలర్ట్!

image

మహిళల ఆరోగ్యం పాడైతే ఇల్లు అనే బండి సాఫీగా కదలదు. ముఖ్యంగా ఇంటి పనులతో పాటు జాబ్ చేసే ఆడవారికి 30 ఏళ్లు దాటితే ఆరోగ్య సమస్యలు వస్తాయని వైద్యులు చెబుతున్నారు. వారంతా గర్భాశయ క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్ష(HPV), రొమ్ము క్యాన్సర్ టెస్ట్, బ్లడ్ షుగర్‌తో పాటు కొలెస్ట్రాల్ పరీక్షలు చేయించుకోవాలని సూచిస్తున్నారు. ఈ పరీక్షల్లో ఏదైనా జబ్బు బయటపడితే తొందరగా నయం చేసుకునే అవకాశం ఉంటుందని చెబుతున్నారు.

error: Content is protected !!